అందుకే పార్టీలో చేరా........ కారెం శివాజీ
ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్గా రాజీనామా చేసిన కారెం శివాజీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్ పక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మూడున్నర సంవత్సరాల పాటు ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్గా సేవలు అందించారు. ఈనేపథ్యంలోనే ఆయన సీఎ జగన్ చేపడుతున్న పలు సంక్షేమ పథకాలను ప్రశంసించారు.

శివాజీని పార్టీలోకి అహ్వానించిన సీఎం
గతంలో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన కారెం శివాజీ అనంతరం టీడీపీకి అనుబంధంగా వ్యవహరించారు. దీంతో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శివాజీకి కీలక భాద్యతలు అప్పగించారు. ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ గా నియమించారు. దీంతో సుమారు మూడున్నర సంవత్సరాల పాటు పదవిలో కొనసాగిన శివాజీ గురువారం రాజీనామా చేశారు. ఏపీ జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే శివాజీకి సీఎం జగన్ పార్టీ ఎంట్రీకి అవకాశం ఇచ్చారు. దీంతో ఆయన వైసీపీలో తీర్థం పుచ్చుకున్నారు.

సీఎం పథకాల వల్లే పార్టీలో చేరాను
పార్టీలో చేరిన సంధర్భంగా మాట్లాడిన శివాజీ టీడీపీలో సరైన గుర్తింపు లేకనే తాను రాజీనామా చేసినట్టు తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు , పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్టు ఆయన చెప్పారు. జగన్ చేపట్టిన పథకాలకు ఆకర్షితుడై పదవీ కాలం ఉన్నా... పార్టీలో బేషరతుగా వైఎస్ఆర్సీపీలో చేరుతున్నాను చెప్పారు. సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు.

మాకు ఇంగ్లీష్ మీడియం అవసరం
ఇటివల సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ విద్యను ఆయన స్వాగతించారు. దీనివల్ల ఎస్సీ ఎస్టీల పిల్లలు అభివృద్దిలోకి వస్తారని చెప్పారు. ఇంగ్లీష్ మాద్యమం వల్ల బడుగు వర్గాల వారికి ఉన్నత స్థాయిలో స్థిరపడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తమ వర్గాలకు ఇంగ్లీష్ మీడియం అవసరమని అన్నారు. సాంప్రదాయ చదువులతో ఆర్ధికంగా వెనకపడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కాగా సీఎం జగన్ నిర్ణయాల వల్ల ఆరునెలల్లోనే 6 లక్షల ఉద్యోగాలు కల్పించారని చెప్పారు. దీంతో బలహీన వర్గాల్లో అనందం వ్యక్తం అవుతోందని అన్నారు. ఈనేపథ్యంలోనే తమ వర్గమంతా సీఎం వెంట ఉంటామని చెప్పారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications