ఏపీకి షాక్: తెలంగాణ విషయంలోకి మమ్మల్ని లాగొద్దని కర్ణాటక
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) వివాదం ఇప్పట్లో తేలేలాలేదు. ఆర్డీఎస్ ఎత్తు పెంచేందుకు తెలంగాణ యత్నిస్తుండగా, దానిని అడ్డుకునేందుకు ఏపీ శతవిధాలా యత్నిస్తోంది.
తన విజ్ఞప్తులను పెడచెవిన పెడుతున్న తెలంగాణ సర్కారుకు పరోక్షంగా షాకిద్దామని భావిస్తున్న ఏపీకి మంగళవారం కర్ణాటక నుంచి పెద్ద షాకే తగిలింది. కర్ణాటక సరిహద్దులో ఉన్న ఆర్డీఎస్పై ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పనులు నిలిపివేయించాలని ప్లాన్ వేసిన ఏపీ ప్రభుత్వం.. జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావును మంగళవారం బెంగళూరు పంపింది.

ఈ క్రమంలో కర్ణాటక జలవనరుల శాఖ కార్యదర్శి గురుపాద స్వామితో వెంకటేశ్వరరావు చర్చలు జరిపారు. అయితే ఆయన ప్రతిపాదనలకు గురుపాదస్వామి పెద్దగా స్పందించలేదు.
అయినా ఆర్డీఎస్ సమస్య తెలుగు రాష్ట్రాలకు చెందినదని, ఇందులో తమ ప్రమేయం ఉండబోదని ఆయన తేల్చేశారు. 'మీ(తెలంగాణ, ఏపీ) మధ్య సమస్యను... మీకు మీరే తేల్చుకోండి. మమ్మల్ని ఇందులోకి లాగొద్దు' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో వెంకటేశ్వరరావు నిరాశగా వెనుదిరిగినట్లు తెలిసింది.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications