ఏపీకి షాక్: తెలంగాణ విషయంలోకి మమ్మల్ని లాగొద్దని కర్ణాటక
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) వివాదం ఇప్పట్లో తేలేలాలేదు. ఆర్డీఎస్ ఎత్తు పెంచేందుకు తెలంగాణ యత్నిస్తుండగా, దానిని అడ్డుకునేందుకు ఏపీ శతవిధాలా యత్నిస్తోంది.
తన విజ్ఞప్తులను పెడచెవిన పెడుతున్న తెలంగాణ సర్కారుకు పరోక్షంగా షాకిద్దామని భావిస్తున్న ఏపీకి మంగళవారం కర్ణాటక నుంచి పెద్ద షాకే తగిలింది. కర్ణాటక సరిహద్దులో ఉన్న ఆర్డీఎస్పై ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పనులు నిలిపివేయించాలని ప్లాన్ వేసిన ఏపీ ప్రభుత్వం.. జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావును మంగళవారం బెంగళూరు పంపింది.

ఈ క్రమంలో కర్ణాటక జలవనరుల శాఖ కార్యదర్శి గురుపాద స్వామితో వెంకటేశ్వరరావు చర్చలు జరిపారు. అయితే ఆయన ప్రతిపాదనలకు గురుపాదస్వామి పెద్దగా స్పందించలేదు.
అయినా ఆర్డీఎస్ సమస్య తెలుగు రాష్ట్రాలకు చెందినదని, ఇందులో తమ ప్రమేయం ఉండబోదని ఆయన తేల్చేశారు. 'మీ(తెలంగాణ, ఏపీ) మధ్య సమస్యను... మీకు మీరే తేల్చుకోండి. మమ్మల్ని ఇందులోకి లాగొద్దు' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో వెంకటేశ్వరరావు నిరాశగా వెనుదిరిగినట్లు తెలిసింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications