ఫైలిన్ కాలేదు, విభజన తుఫానును ఆపుతాం: సిఎం
శ్రీకాకుళం: రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి ఆదివారం సంచలన వ్యాఖ్య చేశారు. ఫైలిన్ తుఫానును ఆపలేకపోయామని, విభజన తుఫానును ఆపడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని ఆయన అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో తుఫాను బాధితులను పరామర్శించి ప్రసంగిస్తున్న సమయంలో ఓ వ్యక్తి సమైక్య నినాదం చేశాడు. ఈ సయమంలో ముఖ్యమంత్రి అలా అన్నారు.
"ఇది దానికి సమయం కాదు. ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నా. ఫైలిన్ సైక్లోన్ను ఆపలేకపోయాం. కానీ ఈ సైక్లోన్ను ఆపే ప్రయత్నం కచ్చితంగా చేస్తాం. అందుకు మీ సహాయ సహకారాలు ఉండాలి" అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అంతకు ముందు ఆయన తుఫాను తాకిడి ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.

ఆ తర్వాత తుఫాను బాధితులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తుఫాను బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత తుఫాన్ వల్ల సంభవించిన నష్టం ఎంతో చెప్తామని ఆయన అన్నారు. తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, వారు విజ్ఞప్తులు పెట్టుకోవడానికి గడువు పెంచుతున్నామని ఆయన చెప్పారు.
తుఫాను వల్ల నష్టపోయిన మత్స్యకారులకు కోటి నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన చెప్పారు. వరికి ఎకరాకు పదివేల రూపాయన నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. తుఫాను బాధితులకు నష్టపహారం పెంచుతామని ఆయన అన్నారు. తమది రైతు ప్రభుత్వమని, రైతులను ఆదుకుంటామని ఆయన చెప్పారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications