తిరుమలలో విశేష ఘట్టం.. క్షేత్రపాలక ఉత్సవం

తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం నాడు 82,337 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 30,825 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.58 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. అళ్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది.

తిరుమలలో మహా శివరాత్రి ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తిరుమల క్షేత్రపాలకుడికి ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు టీటీడీ అర్చకులు. తిరుమల క్షేత్రపాలకుడు.. రుద్రుడు. గోగర్భం సమీపంలో ఉంటుందీ ఆలయం. రుద్రుడి ప్రతిరూపమైన క్షేత్రపాలకుడికి వేడుకగా అభిషేకం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం రుద్రుడికి అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

Kshetrapalaka Rudra in Tirumala Receives Abhishekam on Sacred Sunday during the Maha Shivratri

ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలు, మేళతాళాలు, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా అధికారులు, అర్చకులు క్షేత్రపాలక రుద్రశిల వద్దకు చేరుకున్నారు. పాలు, పెరుగు, చందనం, పన్నీరు, కొబ్బరినీళ్లు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత నైవేద్యం సమర్పించారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మరోవంక- తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి నాటి రాత్రి శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామి నంది వాహనంపై అభయమిచ్చారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో సాయంత్రం 6 గంటల నుండి వాహనసేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా భక్తులు వాహన సేవకు విచ్చేసి కర్పూర హారతులు సమర్పించారు. మ‌హావిష్ణువుకు గరుడ వాహనం ఎంత ప్రీతికరమైనదో పరమేశ్వరునికి నంది వాహనం అంత విశిష్టమైనది.

అర్ధరాత్రి 12 నుండి ఈ తెల్లవారు జామున 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహించారు. ఉదయం 8 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఆధ్యాత్మిక భక్తి భావాన్ని మ‌రింత పెంచేలా టీటీడీ ప‌లు భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. తిరుపతిలోని కపిలతీర్థం, మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలో టీటీడీ హిందూ ధ‌ర్మ ప్ర‌చార‌ప‌రిష‌త్, ఎస్వీ సంగీత నృత్య కళాశాల, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+