ఆ పత్రికపై 75 కోట్లకు పరువు నష్టం దావా వేసిన లోకేష్ .. ఎందుకో తెలుసా !!
ఏపీలో రాజకీయం రసకందాయంలో పడుతుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ పత్రిక సాక్షిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరువునష్టం దావా వేశారు. విశాఖపట్నం 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో ఆయన రూ.75 కోట్లకు పరువునష్టం దావా వేశారు . ఇష్టారాజ్యంగా రాతలు రాసి తన పరువుకు భంగం కలిగించారని లోకేష్ ఈ దావా దాఖలు చేశారు.

చినబాబు చిరుతిండి 25 లక్షలండి వార్తపై లోకేష్ పరువు నష్టం దావా
ఇక లోకేష్ దావా వేసేంత ఆయన పరువుకు భంగం కలిగించిన కథనం ఏమిటి అంటే సాక్షి దినపత్రికలో 2019 అక్టోబర్ 22న ``చినబాబు చిరుతిండి 25 లక్షలండి`` శీర్షికతో వేసిన కథనం లోకేష్ ఆగ్రహానికి కారణం అయ్యింది . అయితే ఆ కథనంలో పేర్కొన్న అంశాలన్నీ పూర్తిగా అవాస్తవాలేనని లోకేష్ చెప్తున్నారు . దురుద్దేశపూర్వకంగా రాసిన తప్పుడు కథనం అని ఖండిస్తూ 2019 అక్టోబర్ 25న సాక్షి సంపాదకబృందానికి నారా లోకేశ్ తరఫున న్యాయవాదులు లీగల్ రిజిస్టర్ నోటీసు పంపించారు.

సాక్షి రాసినవి తప్పుడు కథనాలని పేర్కొన్న లోకేష్
దీనికి సంబంధించి 2019 నవంబర్ 10న సాక్షి నుంచి లోకేష్ కు తిరుగుసమాధానం ఇచ్చారు . ఇక వారి సమాధానానికి సంతృప్తి చెందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరువునష్టం దావా వేశారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో తాను చిరుతిళ్లు తిన్నానని సాక్షి రాసిన తేదీలలో తాను ఇతర ప్రాంతాలలో కావాలని తప్పుడు కథనాలు రాసి తనను ఇబ్బంది పెట్టారని ఆయన పేర్కొన్నారు.

రాజకీయ లబ్ధి కోసమే అని ఆగ్రహం
తన పరువుకు భంగం కలిగించేందుకు, రాజకీయంగా లబ్ధి పొందేందుకు అసత్య ప్రచారాలు చేశారని దావాలో పేర్కొన్నారు. ఉన్నత విద్యావంతుడిగా, ఒక జాతీయ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేసిన తన పరువు ప్రతిష్టలు నాశనం చేసేందుకు ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. తనకు సంబంధంలేని అంశాలతో ముడిపెట్టి అసత్యకథనం రాసి ప్రచురించిన కారణంగా తీవ్రమనోవేదనకు గురయ్యానని పేర్కొన్నారు.

రూ.75 కోట్లకు పరువునష్టం దావా
అందుకు బాధ్యులైన సాక్షి సంస్థ జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్, సాక్షి ప్రచురణకర్త మరియు సంపాదకుడైన వర్థెల్లి మురళి, విశాఖపట్నంకి చెందిన సాక్షి న్యూస్ రిపోర్టర్లు బి వెంకటరెడ్డి, గరికపాటి ఉమాకాంత్లపై రూ.75 కోట్లకు పరువునష్టం దావా దాఖలు చేశారు నారా లోకేష్ . విశాఖపట్నం 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో ఈ ఉదయం ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications