ఏపీలో జాబ్ క్యాలెండర్ రాదు.. పరిశ్రమలు రావు: జగన్ సర్కార్ ను టార్గెట్ చేసిన లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ మరోమారు విరుచుకుపడ్డారు. వివేకానంద జయంతిని పురస్కరించుకుని వివేకానందుడికి నివాళులర్పించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ సందర్భంగా రాష్ట్రంలో యువత పరిస్థితి పై ఆవేదన వ్యక్తం చేశారు.
Recommended Video
వివేకానంద జయంతి రోజు రాష్ట్రంలో యువత పరిస్థితిపై లోకేష్
భారతీయ యువతరంలో చైతన్యం నింపడానికి ఆత్మవిశ్వాసం కలిగించడానికి తన జీవితమంతా కృషి చేసిన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిస్తున్నా అని పేర్కొన్న నారా లోకేష్ ఈరోజు జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్న తెలుగు యువతకు శుభాకాంక్షలు అంటూ తన శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో యువత పరిస్థితి పై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు నారా లోకేష్.
జాబ్ క్యాలెండర్ రాదూ... నోటిఫికేషన్లు రావు
ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం అన్నారు వివేకానంద స్వామి. కానీ ఏపీలో యువత అడుగడుగునా నిరాశ, నిస్పృహలో కూరుకుపోయి ఉంది అంటూ వ్యాఖ్యానించారు. జాబ్ కాలెండర్ రాదు. పరిశ్రమలు రావు అంటూ రాష్ట్రంలో పరిస్థితి ఈ విధంగా ఉందని పేర్కొన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రావు. స్వయం ఉపాధి రుణాలు మంజూరు కావు. విదేశీ విద్యకు సాయం లేదు అంటూ అడుగడుగున యువత నిర్వీర్యమై పోతుందని నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
యువతను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు త్వరలోనే
యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు త్వరలోనే రానుందని నారా లోకేష్ పేర్కొన్నారు .అప్పుడు నిజమైన యువజన ఉత్సవాలను ఘనంగా చేసుకుందాం అప్పటివరకు మార్పు కోసం కృషి చేద్దాం అంటూ నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా యువతకు పిలుపునిచ్చారు.ఇప్పటికే అనేకసార్లు జాబ్ క్యాలెండర్ విషయంలో, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య విషయంలో జగన్ సర్కార్ ను టార్గెట్ చేసిన లోకేష్ వివేకానంద జయంతి రోజు కూడా జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు.
జగన్ సర్కార్ టార్గెట్ గా విరుచుకుపడుతున్న లోకేష్
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి సీఎం జగన్ దృష్టి సారించాలని, కొత్త జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ లోకేష్ జగన్ కు ఈ వ్యవహారంపై లేఖ కూడా రాశారు. జగన్ తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా పోతున్నాయని, ఉన్న పరిశ్రమలు మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన లోకేష్ తాజాగా మరోమారు రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని, రాష్ట్రంలో యువత నిర్వీర్యమై పోతుందని, వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయి అని మండిపడ్డారు. యువతను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని లోకేష్ అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తూనే ఉన్నారు లోకేష్.