గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్రమబంధం: ప్రేయసీప్రియుల మృతి, వీడని మిస్టరీ

గుంటూరు జిల్లా పెద వడ్లపూడిలో సహజీవనం చేస్తున్న ఓ జంట అనుమానాస్పద స్థితిలో మరణించింది.ప్రేయసీప్రియులిద్దరరు ఆత్మహత్య చేసుకుని ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నారు. జాన్ ఉరి వేసుకుని చనిపోగా, జాన్ మృతద

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెద వడ్లపూడిలో సహజీవనం చేస్తున్న ఓ జంట అనుమానాస్పద స్థితిలో మరణించింది. ప్రేయసీప్రియులిద్దరరు ఆత్మహత్య చేసుకుని ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నారు.

తాడేపల్లి పట్టణం డోలాసు నగర్‌కి చెందిన జాన్‌కి గతంలో పెళ్లి అయ్యింది. జాన్ భార్య 3 ఏళ్ల క్రితం అనారోగ్య కారణం గా మరణించింది. అనంతరం జాన్ మంగళగిరి మండలం పెద వడ్లపూడికి చెందిన పద్మ అనే ఓమహిళను చేరదీశాడు. పద్మ అప్పటికే వివాహిత.

Lovers comitted suicide in Guntur district

పద్మకు భర్త, జాన్ కి భార్య లేకపోవడం కారణంగా 3 ఏళ్ల నుండి వీరు సహజీవనం చేస్తున్నారు. ఇద్దరు చాలా మంచిగా ఉండేవారని, మరి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అర్ధం కావటం లేదని బంధువులు అంటున్నారు. జాన్ ఉరి వేసుకుని చనిపోగా, జాన్ మృతదేహం ప్రక్కనే మంచం పై పద్మ మృత దేహం పడి ఉంది.

Lovers comitted suicide in Guntur district

పద్మ నోటిలో నుండి నురగ రావటం తో ఆమె ఏదైనా పురుగులమందు సేవించి ఆత్మహత్య చేసుకుందా? లేదంటే మరేమైనా జరిగిందా? అసలు ఇవి ఆత్మహత్యలా...? లేక ఒక హత్యా, ఒక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా జరిగిన ఘటన మిస్టరీగా మారి ఉత్కంఠ రేపుతోంది.

English summary
Lovers comitted suicide in Guntur district of Andhra Pradesh. They are live in relation from 3 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X