జగన్తో మ్యాచ్ ఫిక్సింగ్, డిగ్గీ ఓ బ్లడీ: ఆనం సంచలనం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ డిగ్గీ రాజా కాదని బ్లడీ రాజా అని ధ్వజమెత్తారు. మధ్య ప్రదేశ్లో వలే ఆంధ్ర ప్రదేశ్లోను కాంగ్రెసు పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని దిగ్విజయ్ సింగ్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
దోచుకునేందుకే జగన్ దీక్ష: కడియం శ్రీహరి
తెలంగాణను అడ్డుకుని మరింత దోచుకునేందుకే వైయస్ జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండులో ఆమరణ దీక్ష చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి వేరుగా మండిపడ్డారు. హైదరాబాదులో జగన్, ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దీక్షలు వచ్చిన తెలంగాణను అడ్డుకోవడానికే అన్నారు.
స్కీంల పేరిట స్కాంలు చేసేందుకు జగన్ దీక్ష పేరుతో నాటకం ఆడుతున్నారన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదు పైన కిరికిరి పెడితే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.