డిజిటల్ ఇండియా: సత్య నాదెళ్ల ఏమన్నారు?, డిజిటల్ ఇండియా ప్రధాన లక్ష్యం? (వీడియో)
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ ఇండియా ప్రాజెక్టుపై మైక్రోసాప్ట్ సీఈఓ సత్య నాదెళ్ల హర్షం వ్యక్తం చేశారు. డిజిటల్ ఇండియా ప్రాజెక్టులో మైక్రోసాప్ట్ భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు.

టెక్నాలజీలోని కొత్త ఆవిష్కరణల ద్వారా దేశాన్ని సమూలంగా మార్చే సత్తా డిజిటల్ ఇండియా ప్రాజెక్టు ఉందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికీ, ప్రతి సంస్ధకు టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలన్నదే మైక్రోసాప్ట్ లక్ష్యమని ఆయన తెలిపారు.
రూరల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, దేశంలో ప్రతిఒక్కరికీ అందుబాటులోకి డిజిటల్ క్లౌడ్ సర్వీసుల వంటి కార్యక్రమాలకు మైక్రోసాప్ట్ మద్దతు ఉంటుందని సత్య నాదెళ్ల తన ప్రకటనలో పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా ప్రాజెక్టు సందర్భంగా ప్రధాని మోడీ, ఐటీ శాఖ మంత్రితో పాటు దేశంలోని పౌరులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు.
Satya Nadella on the launch of Digital IndiaWatch Microsoft CEO Satya Nadella talk about the launch of Digital India & how Microsoft plans to help #empower & #accelerate India #DigitalIndiaDiaries
Posted by Microsoft on Wednesday, July 1, 2015
డిజిటల్ ఇండియా అంటే ఏమిటి?
భారతదేశంలోని పౌరులందరికీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ రంగాల్లోని విప్లవాన్ని ప్రజలకు చేరువచేయడం, ప్రభుత్వ పాలనను డిజిటల్ ఇన్ఫ్రాను ద్వారా ప్రజలు వినియోగించుకునే వెసులుబాటు కల్పించడమే డిజిటల్ ఇండియా ప్రధాన లక్ష్యం. ఇలా చేయడం వల్ల మొత్తం ప్రభుత్వ వ్యవహారాలన్నీ పారదర్శకతతో జరుగుతాయి.

దీంతో పాటు బ్రాడ్బాండ్, హైవేస్ అభివృద్ధి, అందరికీ మొబైల్ కనెక్టివిటీ అందుబాటులోకి తీసుకురావడం, పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రోగ్రామ్, టెక్నాలజీని వినియోగించి పాలనా రంగాన్ని ప్రక్షాళన చేయడం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేవడం లాంటివి.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications