డిజిటల్ ఇండియా: సత్య నాదెళ్ల ఏమన్నారు?, డిజిటల్ ఇండియా ప్రధాన లక్ష్యం? (వీడియో)
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ ఇండియా ప్రాజెక్టుపై మైక్రోసాప్ట్ సీఈఓ సత్య నాదెళ్ల హర్షం వ్యక్తం చేశారు. డిజిటల్ ఇండియా ప్రాజెక్టులో మైక్రోసాప్ట్ భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు.

టెక్నాలజీలోని కొత్త ఆవిష్కరణల ద్వారా దేశాన్ని సమూలంగా మార్చే సత్తా డిజిటల్ ఇండియా ప్రాజెక్టు ఉందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికీ, ప్రతి సంస్ధకు టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలన్నదే మైక్రోసాప్ట్ లక్ష్యమని ఆయన తెలిపారు.
రూరల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, దేశంలో ప్రతిఒక్కరికీ అందుబాటులోకి డిజిటల్ క్లౌడ్ సర్వీసుల వంటి కార్యక్రమాలకు మైక్రోసాప్ట్ మద్దతు ఉంటుందని సత్య నాదెళ్ల తన ప్రకటనలో పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా ప్రాజెక్టు సందర్భంగా ప్రధాని మోడీ, ఐటీ శాఖ మంత్రితో పాటు దేశంలోని పౌరులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు.
Satya Nadella on the launch of Digital IndiaWatch Microsoft CEO Satya Nadella talk about the launch of Digital India & how Microsoft plans to help #empower & #accelerate India #DigitalIndiaDiaries
Posted by Microsoft on Wednesday, July 1, 2015
డిజిటల్ ఇండియా అంటే ఏమిటి?
భారతదేశంలోని పౌరులందరికీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ రంగాల్లోని విప్లవాన్ని ప్రజలకు చేరువచేయడం, ప్రభుత్వ పాలనను డిజిటల్ ఇన్ఫ్రాను ద్వారా ప్రజలు వినియోగించుకునే వెసులుబాటు కల్పించడమే డిజిటల్ ఇండియా ప్రధాన లక్ష్యం. ఇలా చేయడం వల్ల మొత్తం ప్రభుత్వ వ్యవహారాలన్నీ పారదర్శకతతో జరుగుతాయి.

దీంతో పాటు బ్రాడ్బాండ్, హైవేస్ అభివృద్ధి, అందరికీ మొబైల్ కనెక్టివిటీ అందుబాటులోకి తీసుకురావడం, పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రోగ్రామ్, టెక్నాలజీని వినియోగించి పాలనా రంగాన్ని ప్రక్షాళన చేయడం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేవడం లాంటివి.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్












Click it and Unblock the Notifications