కెసిఆర్ భేటీలు: తెలంగాణలో మైక్రోసాఫ్ట్ విస్తరణ
హైదరాబాద్: తెలంగాణలో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలను విస్తరించడానికి ఆ సంస్థ ఇండియా చైర్మన్ అంగీకరించారు. మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణిక్తో పాటు హిందూజా చైర్మన్, ఐటిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోమవారం కెసిఆర్తో సమావేశమయ్యారు. తెలంగాణలో పరిశ్రమలు పెట్టడానికి ఎన్నో సంస్థలు ముందుకు వస్తున్నాయని కెసిఆర్ చెప్పారు. ఇంక్యుబేటర్, టాస్క్, హైఫై అంశాలపై ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు భాస్కర్ ప్రామాణిక్ చెప్పారు. ఆగస్టు ఆరవ తేదీన ప్రభుత్వానికి, మైక్రోసాఫ్ట్ ఇండియాకు మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్లకు పౌరసన్మానం చేస్తామని ప్రభుత్వం చెప్పింది.
తెలంగాణకు అనుకూలమైన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తామని, ఆ తర్వాత సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణలో ఆహార పదార్థాల యూనిట్ను నెలకొల్పడానికి ఐటిసి అంగీకరించింది. లక్ష ఎకరాల్లో సర్వీ చెట్లను పెంచే కార్యక్రమానికి కూడా అంగీకారం తెలిపింది. 3,500 కోట్ల రూపాయలతో కాగితపు పరిశ్రమను నెలకొల్పడానికి కూడా ఐటిసి ముందుకు వచ్చింది.

విత్తనోత్పత్తి పద్ధతులపై త్వరలో సదస్సు నిర్వహిస్తామని కెసిఆర్ చెప్పారు. ఈ సదస్సుకు స్వామినాథన్ను ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. తాను చెన్నై వెళ్లి స్వామినాథన్ ఫౌండేషన్ను సందర్శిస్తానని చెప్పారు. స్వామినాథన్ సిఫార్సులు తమకు స్ఫూర్తి అని ఆయన చెప్పారు. వాటిని అమలు చేసే అవకాశం తమకు వచ్చిందని అన్నారు.
విత్తనోత్పత్తిని ప్రోత్సహించాలని స్వామినాథన్ సూచించారని ఆయన గుర్తు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయాలని ఆయన అన్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications