అనంతపురంలో భూప్రకంపనలు, రెండుగా చీలిన రోడ్డు
అనంతపురం జిల్లా జీడిపల్లిలో మంగళవారం ఉదయం భూప్రకంపనలు వచ్చాయి. వీటి తీవ్రతకు సీసీ రోడ్డు రెండుగా చీలిపోయింది. దీంతో గ్రామస్తులు భయపడి ఇళ్ల బయటకు వచ్చారు.
అనంతపురం: అనంతపురం జిల్లా జీడిపల్లిలో మంగళవారం ఉదయం భూప్రకంపనలు వచ్చాయి. వీటి తీవ్రతకు సీసీ రోడ్డు రెండుగా చీలిపోయింది. దీంతో గ్రామస్తులు భయపడి ఇళ్ల బయటకు వచ్చారు.
భూమిలో భారీ శబ్దంతో పాటు భూమి కంపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సుమారు తొమ్మిది సెకన్ల పాటు భూమి కంపించింది. ఇళ్లలోని వస్తువులు కిందపడిపోవడంతో భయభ్రాంతులకు గురైన గ్రామస్థులు ఇళ్లలో నుంచి బయటకి పరుగులు తీశారు.

విషయం తెలుసుకున్న అధికారులు గ్రామాన్ని సందర్శించి భూకంప తీవ్రతను గుర్తించే పనిలో ఉన్నారు. భూమి ఇలా కంపించడం సంవత్సర కాలంలో ఇది రెండోసారి.
కూడేరు మండలం ఎంఎం హళ్లిలో కూడా అతి స్వల్పంగా భూప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. జిల్లాలోని జీడిపల్లి, ఎంఎం హళ్లి తదితర ప్రాంతాల్లో కూడా భూమి స్వల్పంగా కంపించింది.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications