పవన్ కల్యాణ్ కు మంత్రి బొత్సా సవాల్ - జనంలోకి వెళ్తాం..!!
ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణ జనసేనాని పవన్ పై కీలక వ్యాఖ్యలు చేసారు. విద్యా శాఖ ఆంగ్ల భోధన కోసం తీసుకుంటున్న నిర్ణయాలు..బైజూస్ తో ఒప్పందంలో అవినీతి జరిగిందని పవన్ తో సహా జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. వీటి పైన బొత్సా స్పందించారు. ఈ నెల 26న ఇచ్ఛాపురం నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ వై నీడ్స్ జగన్ పేరుతో జనంలోకి వెళ్తామన్నారు. ప్రజలకు చేసిన మంచి వివరిస్తామని వెల్లడించారు.
ఏపీ వై నీడ్స్ జగన్: వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నారేళ్లల్లో మంచి జరిగిందని మంత్రి బొత్సా వివరించారు. ప్రజలకు జరిగిన మేలును వివిరించటమే లక్ష్యంగా బస్సు యాత్ర ఉద్దేశమని స్పష్టం చేసారు. సామాజిక సాధికార బస్సు యాత్రతో ప్రజలకు మరింత చేరువ అవుతామని చెప్పారు. సమాజిక న్యాయం చేసిన నాయకుడు సీఎం జగన్ మాత్రమేనని చెప్పుకొచ్చారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా నేరవేర్చామని చెప్పారు. వైసీపీ పాలనలో జరిగిన సంక్షేమం..డెవలప్ మెంట్ గురించి 175 నియోజకవర్గాల ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు. సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నామని బొత్సా వివరించారు. బెల్టుషాపులు లేకుండా నియంత్రణ చేసామని చెప్పారు.
పవన్ కు అవగాహన లేదు: మేనిఫెస్టోను ముందుకు తీసుకెళ్లి ఓట్లు అడిగే దమ్ము టీడీపీకి ఉందా అని బొత్సా ప్రశ్నించారు. పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏ అంశం పైనా అధ్యయనం చేయకుండా మాట్లాడుతున్నారని దుయ్య బట్టారు. బైజూస్ ద్వారా విద్యార్ధులకు ఉచితంగా కంటెంట్ అందిస్తున్నామని చెప్పారు.
పేద విద్యార్ధులు ఇంగ్లీషు మీడియంలో చదవకూడదా అని ప్రశ్నించారు. మన విద్యార్దులు అందరూ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలనేది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసారు. ఉత్తరాంధ్రకు రైల్వే జోన్ రావాలన్నదే తమ డిమాండ్ అని వెల్లడించారు. ఏపీలో తలసరి ఆదాయం పెరిగిందని చెప్పారు. బైజూస్ తో ఒప్పందం పైన ఆరోపణలు చేస్తున్న పవన్ సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తారా అని సవాల్ చేసారు.
ప్రజల్లోకి వెళ్లి వివరిస్తాం: తన పైన కేసులు పెడతానని పవన్ మాట్లాడుతున్నారని..అధికారంలోకి వస్తున్నట్లు కలలు కంటున్నారని బొత్సా ఎద్దేవా చేసారు. నాలుగున్నారేళ్లుగా సీఎం జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని ఉత్తరాంధ్ర పార్టీ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
సామాజిక సాధికార బస్సు యాత్రను ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ యాత్రలో ప్రతీ ఒక్కరికీ జరిగిన మేలు వివరిస్తామన్నారు. దళితులు..గిరిజనులకు సీఎం జగన్ చేసిన మేలు గతంలో ఎవరూ చేయలేదన్నారు. ఈ నెల 26న ఇచ్చాపురం నుంచి బస్సు యాత్ర ప్రారంభించి మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ కొనసాగుతుందని వెల్లడించారు.
-
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
Pawan kalyan vs Ranveer Singh:ఉస్తాద్ వర్సెస్ ధురందర్..హ్యాట్రిక్ పోరులో గెలుపెవరిది? -
విడుదల వేళ.. ఉస్తాద్ షాకింగ్ డెసిషన్ -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు!












Click it and Unblock the Notifications