మంత్రి సుజాత సరదా: అదుపు తప్పిన ట్రాక్టర్
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలలో ఆంధ్రప్రదేశ్ మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత ట్రాక్టర్ నడిపారు. అయితే అదుపుతప్పింది. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో గురువారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది.
గురువారం ఉదయం ఎంపీడీవో కార్యాలయం వద్ద లబ్దిదారులకు ట్రాక్టర్ అందించే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరదాగా ఆమె ట్రాక్టర్ నడిపేందుకు ప్రయత్నించారు.

ఒక్కసారిగా ట్రాక్టర్ అదుపుతప్పి నాయకులు, కార్యకర్తలపైకి దూసుకెళ్లింది. దీంతో అంతా అక్కడి నుంచి పరుగులు తీశారు. వెంటనే కొంతమంది కార్యకర్తలు ట్రాక్టర్ను అదుపు చేశారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు ఇంకా అందాల్సి ఉంది.












Click it and Unblock the Notifications