2024 ఎన్నికల్లో ఏపీలో అధికారం వారికే - ఎంపీ సీఎం రమేష్..!!
బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రానున్న ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారో జోస్యం చెప్పారు. జగన్ సర్కార్ తీరుపై బీజేపీ సీరియస్గా ఉందన్నారు. ఉపేక్షించే పరిస్థితిలో లేదని చెప్పుకొచ్చారు. ఏపీలో కక్ష సాధింపు రాజకీయాలు నడుస్తున్నాయని విమర్శించారు.
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సీఎం రమేష్, సుజనా చౌదరి సమావేశమయ్యారు. తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ సమావేశం తరువాత కొత్త సమీకరణాలు తెర పైకి వచ్చాయి. ఇప్పుడు సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయంగా ఆసక్తి కర చర్చ మొదలైంది.

బీజేపీతో పొత్తు ఉన్న పార్టీకే: ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో పొత్తు ఉన్న పార్టీకే అధికారం దక్కుతుందని సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. ఏపీలో బీజేపీతో ప్రస్తుతం జనసేన పొత్తు కొనసాగిస్తోంది. తమ రెండు పార్టీలు టీడీపీతోనూ కలుపుకొని వెళ్లాలనేది పవన్ కల్యాణ్ ఆలోచన. ఇదే అంశాన్ని తాజాగా ఢిల్లీ పర్యటనలో బీజేపీ ముఖ్య నేతల వద్ద ప్రతిపాదించారు. కానీ, వారి నుంచి స్పష్టత రాలేదని సమాచారం.
కర్ణాటక ఎన్నికల తరువాత ఈ అంశం పైన బీజేపీ నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ నిర్ణయానికి అనుగుణంగా పవన్ రాజకీయ పొత్తుల పైన స్పష్టత ఇవ్వనున్నారు. జనసేన తమతోనే కొనసాగుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ - జనసేన పొత్తు ఖాయమని ఆ రెండు పార్టీల నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ తాజా ప్రతిపాదన: ఇప్పుడు సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలతో కొత్త చర్చ మొదలైంది. జనసేన బీజేపీని కాదని, టీడీపీ వైపు వెళ్లేందుకు సిద్దమయ్యారు. చివరి ప్రయత్నంగా బీజేపీతో మూడు పార్టీల పొత్తుల అంశం పైన ప్రతిపాదన చేసారు. ఈ సమయంలో బీజేపీ నేతలు ఏపీలో పొత్తుల అంశంలో కదలిక వచ్చినట్లు కనిపిస్తోంది. పవన్ కోరుకున్న విధంగా మూడు పార్టీల పొత్తుకు బీజేపీ సిద్దం అవుతోందా..
లేక, జనసేనతో మాత్రమే పొత్తు కొనసాగించాలని కోరుకుంటుందా అనేది కొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 2014 తరహాలో మూడు పార్టీల కలయిక దిశగా టీడీపీ శ్రేయోభిలాషులు ఢిల్లీ కేంద్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ కేంద్ర నాయకత్వం తీసుకొనే నిర్ణయం ఆధారంగా ఏపీలో పొత్తులు ఫైనల్ కానున్నాయి.
2014 ఫార్ములా రిపీట్ అయ్యేనా: రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇటు ఏపీలో పాలన పైన విమర్శలు చేస్తూనే..ఏపీలో అధికారం గురించి వ్యాఖ్యలు చేసారు. జగన్ సర్కార్కు రైతుల సమస్యలు పట్టడం లేదని దుయ్యబట్టారు. ఏపీ సర్కార్ ప్రజలకు రూ.10 ఇస్తూ.. రూ.100 వసూలు చేస్తోందని విమర్శించారు. ప్రజలు అన్ని అంశాలను గమనిస్తున్నారని సీఎం రమేష్ చెప్పుకొచ్చారు.
టీడీపీతో పొత్తుకు అవకాశం లేదని బీజేపీ నేతలు ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు. పొత్తుల పైన అంతిమ నిర్ణయం ప్రధాని మోదీ - కేంద్ర హోం మంత్రి అమితి షా నిర్ణయానికి అనుగుణంగా ఉండనుంది. దీంతో...ఈ పొత్తుల అంశం ఇప్పుడు రాజకీయంగా మరోసారి రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది.
-
"ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు" -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్












Click it and Unblock the Notifications