నీతు అగర్వాల్కు షాక్, ఫోన్ల వివరాలు తెల్సుకోవాలి
కర్నూలు: ఎర్ర చందనం అక్రమ రవాణా కేసులో నిందితురాలిగా ఉన్న సినీ నటి నీతు అగర్వాల్ బెయిల్ పిటిషన్ను కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ న్యాయస్థానం కొట్టువేసింది. శనివారం బెయిల్ పిటిషన్ పైన వాదనలు జరిగాయి.
ఈ కేసులో విచారణ పూర్తయిందని, నీతు అగర్వాల్కు బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది కోరారు. ఈ కేసులో విచారణ ఇంకా పూర్తిగా ముగియలేదని, మరో నలుగురిని అరెస్టు చేయవలసి ఉందని రుద్రవరం పోలీసుల తరఫున న్యాయవాది చెప్పారు.

నిందితురాలి ఫోన్ నుండి వచ్చిన, వెళ్లిన ఫోన్ల వివరాలు తెలుసుకోవాల్సి ఉందని చెప్పారు. ఈ దశలో ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే విచారణ పైన ప్రభావం పడుతుందని చెప్పారు. ఇరువురి వాదనలు విన్న అనంతరం కోర్టు నీతు అగర్వాల్కు బెయిల్ నిరాకరించింది.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications