ఉదయం 6 గంటలకు జైలు నుంచి విడుదలైన హీరోయిన్ నీతూ అగర్వాల్
హైదరాబాద్: ఎర్రచందనం అక్రమ రవాణాలో ప్రయేయముందన్న కారణంగా అరెస్టైన టాలీవుడ్ హీరోయిన్ నీతూ అగర్వాల్ను ఈరోజు ఉదయం జైలు నుంచి విడుదల చేశారు. బెయిల్ కోసం ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్ను కర్నాలు ఆళ్లగడ్డ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
షరతులతో కూడిన బెయిల్ను మంగళవారం మంజూరు చేసింది. దీంతో కోర్టు పేపర్లు అందుకున్న నంద్యాల సబ్ జైలు అధికారులు బుధవారం ఉదయం 6 గంటలకు ఆమెను విడుదల చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, చాగలమర్రి ఎంపీపీ మస్తాన్ వలిని పెళ్లి చేసుకున్న నీతూ అగర్వాల్ ఎర్ర చందనం స్మగ్లర్లకు తన బ్యాంకు ఖాతా ద్వారా డబ్బు పంపిన సంగతి తెలిసిందే.

ఆమె కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ కు సహకరించిందనే అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను తమ కస్టడీలోకి తీసుకుని పోలీసులు రెండు రోజుల పాటు ప్రశ్నించారు. ఆమె పోలీసు విచారణలో ఏం చెప్పిందనే విషయాలు తెలియడం లేదు.
13వ తేదీ నుండి నీతు కోసం పోలీసులు గాలిస్తూ చివరికి అదుపులోకి తీసుకోగలగారు. నీతూకి ఎర్రచందనం స్మగ్లింగ్తో ఎలాంటి సంబంధం లేదని, తనతో సన్నిహితంగా ఉంటున్న కారణంగానే ఆమెపై కొందరు పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని మస్తాన్ వలీ అన్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications