షాక్: బండిశూల తిరుణాలలో అపశృతి, ఇద్దరు మృతి
అనంతపురం: అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం రామరాజుపల్లె-కాశేపల్లె మధ్యలో శుక్రవారం రాత్రి జరిగిన పోలేరమ్మ బండిశూల తిరుణాలలో అపశృతి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. రథాన్ని లాగుతుండగా విద్యుదాఘాతం జరిగి పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రథం వద్ద ఉన్న రామాంజులరెడ్డి(25) విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందారు.
తీవ్రంగా గాయపడిన ముత్యాలరెడ్డి(45)ని గుత్తి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. శుక్రవారం రాత్రి గ్రామంలో ఎడ్లబండిపై బండిశూల తిరుణాల నిర్వహిస్తుండగా కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో ఒక్కసారిగా విద్యుదాఘాతం జరగడంతో నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి.

షాక్ తగిలి మూడు ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో హాహాకారాలు చెలరేగాయి. జనం ప్రాణభయంతో పరుగులు తీశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, అధికారులు క్షతగాత్రులను హుటాహుటిన గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆ సంఘటనతో విద్యుత్ సరఫరాను నిలిపేశారు. అక్కడ తీవ్ర అంధకారం అలుముకుంది. హాహాకారాలు మిన్ను ముట్టాయి. ఏం జరుగుతోందో కూడా తెలియని అయోమయం ఏర్పడింది. తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications