సీఎం జగన్ - రైతుల మధ్య అదే సెంటిమెంట్ : 75 ఏళ్లకు మోక్షం - వరుస నిర్ణయాలతో..!!
భూమి రైతన్నకు ఒక సెంటిమెంట్. కానీ, ముఖ్యమంత్రి జగన్ - రైతుల మధ్య సెంటిమెంటల్ ఎటాచ్ మెంట్. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల కోసం వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలతో ఇది మరసారి రుజువు అయిది. రాష్ట్రంలో 75 ఏళ్లు అయినా భూ రికార్డులు ఖచ్చితంగా లేవు. వాటిని సరి చేయటంతో పాటుగా.. రాష్ట్ర వ్యాప్తంగా 355 గ్రామాల్లోని 18,889 సర్వే నెంబర్లలో.. 35,669 ఎకరాల భూములు 22(ఏ) నిషేధిత జాబితాలో ఉండగా.. ఇప్పుడు వాటన్నింటినీ డీనోటిఫై చేస్తూ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రైతుల్లో సంతోషానికి కారణమవుతోంది.

మహాయజ్ఞంలా భూసర్వే
రాష్ట్రంలోని భూముల లెక్కలను పక్కాగా తేల్చేందుకు సీఎం జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా.. మహాయజ్ఞంలా భూసర్వే ప్రారంభించారు. ఇందు కోసం 15వేల మంది సర్వేయర్లను రిక్రూట్ చేశారు. అత్యాధునిక పరికరాలను భూ సర్వేకు ఉపయోగిస్తున్నారు. భూముల రీసర్వేతో రికార్టులను అప్డేట్ చేస్తున్నారు. వచ్చే ఏడాదికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. చుక్కల భూములని, అనాధీన భూములని ఇటువంటి నిషేధిత జాబితాలో ఉన్న భూములకు పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. నవంబర్లో 1500లకు పైగా గ్రామాల్లో సర్వే పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. హద్దులు సరిచేసి హక్కు పత్రాలు ప్రభుత్వం అందచేయనుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం గ్రామాల్లోనే ఉండేలా అడుగులు వేస్తున్నామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు.

22(ఏ) కింద నిషేధిత జాబితా కు మోక్షం
90 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతుల భూముల్లో దాదాపుగా 355 గ్రామాల్లో 35,669 ఎకరాల భూమిని నాటి ప్రభుత్వం 22(ఏ) కింద నిషేధిత జాబితాలో చేర్చింది. తాజాగా, సీఎం జగన్ ఆ భూములను డీనోటిఫై చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా తక్షణం 22,042 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటికే వైఎస్సార్ రైతె భరోసా - పీఎం కిసాన్ పథకం కింద రాష్ట్రంలోని 50.92 లక్షల మంది రైతులకు ఏటా 13,500 రూపాయల చొప్పున ఆర్దిక సాయం అందుతోంది. దీంతో పాటుగా ప్రతీ గ్రామ సచివాయలయం లోనే ఆర్బీకే కేంద్రాలు ఏర్పాటు చేసారు. పంట నష్టపోయిన రైతులకు అదే సీజన్ లో పరిహారం అందేలా విధి విధానాలు అమలు చేస్తున్నారు. 2016లో టీడీపీ ప్రభుత్వ హయాంలో క్రిష్ణా జిల్లాలోనే అవనిగడ్డ, నాగాయలంక ప్రాంతాల్లో సుమారు 16 వేల ఎకరాలు ఈ జాబితాలో వున్నాయి. నిషేధిత జాబితాలో ఉండటంతో క్రయ, విక్రయాలకు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవటానికి సైతం అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది.

రైతు అనుకూల నిర్ణయాలతో
ఇప్పుడు ప్రభుత్వం నిషేధిత జాబితా నుంచి ఆ భూములను తొలిగించి యజమానులకు అప్పగించింది. వీటికి సంబంధించిన పత్రాలను రైతులకు అందచేసిన ముఖ్యమంత్రి జగన్ గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించాలన్నారు. త్వరలో భూసర్వే పూర్తి కావటం ద్వారా..భూ సమస్యల కోసం రెవిన్యూ కార్యలయాలు - కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని ముఖ్యమంత్రి చెప్పారు. అదే సమయంలో రాష్ట్రంలో జగన్ సీఎం అయిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సారి కూడా ఒక్కటి కూడా కరువు మండలం ప్రకటించకపోవటం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఎక్కడా కరువు అనేదే రాష్ట్రంలో ఈ మూడున్నారేళ్ల పాలనలో కనిపించట లేదు. దీంతో, వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు అన్ని రకాలుగా జరుగుతున్న మేలు గురించి ప్రభుత్వం ప్రతీ సందర్భంలోనూ గుర్తు చేస్తోంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications