కలకలం రేపిన పరకాల తీర్మానం: చంద్రబాబు వివరణ
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు భారత రత్న ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ మహానాడులో తీర్మానం ప్రవేశపెట్టడం కొంత కలకలం రేపింది.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆదివారం ఉదయం కార్యక్రమంలో పరకాల ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈయన తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఉన్నట్టు దాఖలాలు లేవు.

కాగా, దీనిపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహానాడు వేదికపై నుంచి వివరణ ఇచ్చారు. పరకాల ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం తప్పేమీ కాదని, ఆయన ప్రభుత్వ సలహాదారు అని, అతని పదవీ నియామకం రాజకీయంగా జరిగిందని వివరించారు.
అయితే, ప్రతీ మహానాడులోనూ ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేస్తున్నా అందుకు తగిన ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, మహానాడు రెండో రోజు కూడా ఎమ్మెల్యే బాలకృష్ణ గైర్హాజరయ్యారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications