వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేనేతల కార్మికుల కన్నీళ్ళు తుడుస్తా, ధర్మవరం బ్రాండ్ ఇమేజ్ పెంచుతా: పవన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

అనంతపురం: ధర్మవరం బ్రాండ్ ఇమేజ్‌ను పెంచే బాధ్యతను తీసుకొంటానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు.చేనేత కార్మికుల సమస్యలపై నివేదికను ఇస్తే వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ హమీ ఇచ్చారు. అయితే సమయం పట్టినా సమస్య పరిష్కారమయ్యేందుకు కృషి చేస్తానని పవన్ చెప్పారు.

సోమవారం నాడు అనంతపురం జిల్లాలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పర్యటన మూడో రోజు కొనసాగింది. ఉదయం పూట పవన్ కళ్యాణ్ సత్యసాయి సమాధిని సందర్శించారు.

Recommended Video

పవన్ కొత్త డిమాండ్, అపశృతి: హోదాపై మాట్లాడవేం పవన్ ?

పుట్టపర్తి నుండి పవన్ కళ్యాణ్ నేరుగా ధర్మవరం చేరుకొని చేనేత కార్మికులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు.

ధర్మవరం చేనేత బ్రాండ్ ఇమేజ్ పెంచుతా

ధర్మవరం చేనేత బ్రాండ్ ఇమేజ్ పెంచుతా

అనంతపురం జిల్లా చేనేత బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ధర్మవరంలో చేనేత కార్మికులతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకొన్నారు.చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హమీ ఇచ్చారు. చేనేత కార్మికుల సమస్యలను నివేదిక రూపంలో ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళనున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు. మరో వైపు ఈ సమస్యలను ఆలస్యమైనా పరిష్కరించనున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు.

ధర్మవరం చేనేత పరిశ్రమకు అంతర్జాతీయ మార్కెట్ సౌకర్యం కల్పిస్తా

ధర్మవరం చేనేత పరిశ్రమకు అంతర్జాతీయ మార్కెట్ సౌకర్యం కల్పిస్తా

ధర్మవరం చేనేత పరిశ్రమకు అంతర్జాతీయ మార్కెట్ సౌకర్యాన్ని కల్పించనున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ధర్మవరం నేత కార్మికులే తమ ఉత్పత్తులను విక్రయించుకొనే ఏర్పాటు చేస్తానని పవన్ కళ్యాణ్ హమీ ఇచ్చారు.సమయం పట్టినా కానీ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు.

 కరువు సమస్యను తీరుస్తాం

కరువు సమస్యను తీరుస్తాం

అనంతపురం జిల్లాలో కరువు సమస్యలను తీరుస్తామని పవన్ కళ్యాణ్ ధీమాను వ్యక్తం చేశారు.అనంతపురం జిల్లాను కరువును బయట పడేస్తే ఎందరికో మేలు జరుగుతోందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. కరువు బారినుండి అనంతపురాన్ని రక్షించేందుకు తన వంతు ప్రయత్నాలను చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

 ప్రజల సమస్యలే ముఖ్యం

ప్రజల సమస్యలే ముఖ్యం

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే తన ముందున్న కర్తవ్యమని పవన్ కళ్యాణ్ చెప్పారు. సినీ రంగంలో ఉన్నప్పటికీ ఆ రంగంలో ఉన్న సమస్యల కంటే ప్రజల సమస్యలను పరిష్కరించడమే తనకు ఇష్టమన్నారు పవన్ కళ్యాణ్. అనంతపురం జిల్లాలో తాను పర్యటిస్తున్న సమయంలో తమ ఇంటికి రావాలని ఎందరో ఆహ్వనించిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకొన్నారు.

English summary
Pawan Kalyan while giving speech about Handloom workers said he doesn't like to call them workers as weaving is an art. He said all the workers are amazing artists. He said such an amazing art will disappear slowly if continued to neglect it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X