రంగంలో దిగిన పవన్ కల్యాణ్: చంద్రబాబు రూట్‌లో..!!

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో అడుగు పెట్టనున్నారు. సుదీర్ఘ విరామం తరువాత ఏపీకి రానున్నారు. మార్చిలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, ఈ సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం ఆయన మళ్లీ ఏపీకి రాబోతోండటం ఇదే తొలిసారి.

బుధవారం ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. పంట నష్టపరిహారాన్ని చెల్లించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విఫలమైందంటూ ఆరోపిస్తోన్న పవన్ కల్యాణ్- ఇక నేరుగా క్షేత్రస్థాయిలో రైతుల తరఫున పోరాటం చేయనున్నారు.

Pawan Kalyan will visit Godavari districts on May 10

గురువారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో కడియానికి బయలుదేరి వెళ్తారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పవన్ కల్యాణ్ పరామర్శిస్తారు. కొత్తపేట మండలం ఆవిడిలో రైతులతో ముఖాముఖిగా సమావేశమౌతారు. వారి కష్టాలను తెలుసుకుంటారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటన షెడ్యూల్ అయింది. వివిధ నియోజకవర్గాల మీదుగా పర్యటన సాగుతుంది. ఈ పర్యటనలో ఆయన వెంట- జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఉమ్మడి గోదావరి జిల్లాల పార్టీ నాయకులు ఆయన వెంట ఉంటారు.

గతంలో ఇదే ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ పెద్ద ఎత్తున కౌలు రైతు భరోసా యాత్రను నిర్వహించిన విషయం తెలిసిందే. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడానికి జనసేన ఈ యాత్రను చేపట్టింది అప్పట్లో. పవన్ కల్యాణ్ ఇందులో పాల్గొన్నారు. రైతు కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందించారు.

ఉమ్మడి గోదావరి జిల్లాలో 40 మందికి పైగా రైతు కుటుంబాలకు ఆయన చెక్కులు అందించారు. రైతు సమస్యల మీదే పవన్ కల్యాణ్ మరోసారి పర్యటించబోతోన్నారు. ఇదివరకు తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించారు. ఇప్పుడు అదే రూట్‌లో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో అడుగు పెట్టనున్నారు. సుదీర్ఘ విరామం తరువాత ఏపీకి రానున్నారు. మార్చిలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, ఈ సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం ఆయన మళ్లీ ఏపీకి రాబోతోండటం ఇదే తొలిసారి.

బుధవారం ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. పంట నష్టపరిహారాన్ని చెల్లించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+