షర్మిల కొత్త టార్గెట్ - నేరుగాబరిలోకి..!!
ఏపీ ఎన్నికల రాజకీయం ఆసక్తిగా మారుతుంది. బిజెపి, టిడిపి, జనసేన కలిపి ఎన్డీఏ కూటమిగా పోటీలో ఉన్నాయి. కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి మరోకూటమిగా పోటీ చేస్తుంది. జగన్ సింగిల్ గానే ఎన్నికల బరిలోకి దిగారు. ఇక ఇప్పుడు షర్మిల ఎన్నికల వేల కొత్త అస్త్రంతో ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు.
ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల నేటి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. కడప ఎంపీగా షర్మిల పోటీ చేస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు ప్రచారంలో భాగంగా బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో షర్మిల ప్రచారం కొనసాగనుంది. ఇప్పటికే షర్మిల తాను ఎందుకు ఎన్నికల బరిలోకి దిగాల్సి వచ్చింది అనే అంశాన్ని వివరించారు. కుటుంబంలో చీలిక రావటం బాధాకరమైనా పోటీ తప్పడం లేదన్నారు. తన చిన్నాన్న వివేక చివరి కోరిక మేరకే తాను కడప ఎంపీగా బరిలో నిలుస్తున్నానని చెప్పుకొచ్చారు. కడప వేదికగా ఇప్పటికే సీఎం జగన్ వివేక హత్య .. ఆరోపణ పైన స్పందించారు. వివేకాన్ని చంపింది ఎవరో కడప జిల్లా వాసులకి తెలుసని చెప్పుకొచ్చారు.

ఇక ఇప్పుడు షర్మిల తన ప్రచారంలో మరోసారి వివేక హత్యను ప్రధాన ప్రచారస్రంగా మలుచుకునే అవకాశం కనిపిస్తుంది. షర్మిల ప్రత్యర్థిగా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. టిడిపి నుంచి భూపేష్ రెడ్డిని ప్రకటించారు. మారుతున్న సమీకరణలో భాగంగా ఎంపీగా ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు నుంచి భూపేష్ రెడ్డి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. షర్మిల బరిలోకి దిగటం ద్వారా కడప సీటు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. అవినాశనం గెలిపించుకోవడం జగన్కు ప్రతిష్టాత్మకంగా మారుతుంది. షర్మిల సైతం ఇక్కడి నుంచి గెలుపును సీరియస్ గా తీసుకుంటున్నారు. మూడు పార్టీల నుంచి పోటీ ఉండటంతో కడప ఓటర్లు ఏం తేల్చబోతున్నారనేది ఆసక్తిని పెంచుతుంది.
-
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్












Click it and Unblock the Notifications