మిషన్ హిందూపురం: బాలయ్య అడ్డాలో మంత్రి పెద్దిరెడ్డి మకాం
పుట్టపర్తి: వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. ప్రత్యర్థి పార్టీలకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదని, 175 స్థానాల్లోనూ పార్టీ జెండా ఎగరాలనే పట్టుదలతో ఉన్నారు. దీనికోసం వైనాట్ 175 కాన్సెప్ట్ను ప్రవేశ పెట్టారు.
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోన్నారు. ఈ విషయంలో రాజీపడట్లేదు. సరిగ్గా పనిచేయని, జనంలో లేని ఎమ్మెల్యేలకు టికెట్ల దక్కబోవంటూ ఇదివరకే హెచ్చరించారు కూడా. దీని కోసం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొలమానంగా తీసుకుంటోన్నారు.

ఎమ్మెల్యేల పనితీరును బేరీజు వేయడానికి, పరిపాలన- సంక్షేమ పథకాల అమలుపై ప్రజాభిప్రాయాలను సేకరించడానికి గడప గడపకూ మన ప్రభుత్వం ద్వారా ప్రజల నుంచి నేరుగా అందే ఫీడ్బ్యాక్ను వైఎస్ జగన్ ప్రాతిపదికగా తీసుకుంటోన్నారు. దీని ఆధారంగానే టికెట్లను కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే- నాలుగైదు సార్లు ఆయన ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు.
వైనాట్ టాస్క్ను కంప్లీట్ చేయాలంటే వైఎస్ఆర్సీపీకి కుప్పం, హిందూపురం నియోజకవర్గాల్లోనూ పాగా వేయాల్సి ఉంటుంది. చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న నియోజకవర్గాలు అవి. టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఓడిపోని నియోజకవర్గాలు ఈ రెండూ కూడా. బలమైన ఈ రెండు నియోజకవర్గాల్లో జెండా ఎగరేయాలేది వైసీపీ వ్యూహం.

ఇందులో భాగంగా- వైసీపీ రాయలసీమ జిల్లా కోఆర్డినేటర్, విద్యుత్- అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురంలో పర్యటించారు. పార్టీ సీనియర్ నేతలతో సమావేశం అయ్యారు. నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను కలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అనంతరం పార్టీ నేత, ఏపీ ఆగ్రోస్ ఛైర్మన్ నవీన్ నిశ్చల్ నివాసానికి వెళ్లారు.
అనంతరం పెద్దిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం, హిందూపురం నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ రెండు చోట్లా టీడీపీకి ఓటమి తప్పదని అన్నారు. దొంగ ఓట్లను అడ్డుగా పెట్టుకుని టీడీపీ గెలుస్తూ వస్తోందనేది బహిరంగ రహస్యమని, దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications