2రాష్ట్రాల మధ్య నలిగిపోతున్నాం: ట్యాపింగ్పై ఆపరేటర్లు, కాల్డేటాకు ఓకే
ఢిల్లీ/విజయవాడ: తాము రెండు రాష్ట్రాల మధ్య నలిగిపోతున్నామని టెలికాం ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంలో గురువారం నాడు టెలికాం ఆపరేటర్లకు తాత్కాలిక ఊరట లభించింది.
కాల్ డేటా వివరాలు వారంలోగా ఇవ్వాలని, అయితే సీల్డు కవర్లో ఇచ్చిన వాటిపై నెల రోజుల తర్వాత విచారణ చేపట్టాలని విజయవాడ కోర్టును సుప్రీం ఆదేశించింది.

కాల్ డేటా వివరాలు ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని టెలికాం ఆపరేటర్లు సుప్రీం కోర్టులో తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య తాము నలిగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది.
దీనిపై సుప్రీం స్పందిస్తూ.. వారంలోగా కాల్ డేటా వివరాలు సీల్డు కవరులో విజయవాడ న్యాయస్థానానికి ఇవ్వాలని ఆదేశించింది. మూడు వారాల తర్వాతే డేటాను ఓపెన్ చేయాలని ఆదేశించింది. నెల రోజుల తర్వాత విచారణ చేపట్టాలని విజయవాడ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.
-
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications