కాన్వాయ్ పై రాళ్ల దాడి.. పోలీసుల విచారణలో తేలిందేమిటంటే..
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నందిగామలో పర్యటించిన సందర్భంలో ఆయన కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. డీసీపీ విశాల్ గున్ని పర్యవేక్షణలో సిట్ లు పని చేస్తాయని పోలీసు కమీషనర్ కాంతి రాణా తెలిపారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఎత్తయిన భవనాల నుంచి ఈ రాళ్లను విసిరినట్లు తేలింది. సంఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలోని భవనాల నుంచే రాళ్లు వచ్చాయని పోలీసులు భావిస్తున్నారు.
వారు ఘటనా స్థలాన్ని పరిశీలించడమే కాకుండా అనుమానాస్పదంగా కనిపిస్తున్న వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. ఘటన జరిగిన స్థలంలో ఉన్న సీసీ కెమెరాల పుటేజిని పరిశీలిస్తున్నామని, ఆ పర్యటనలో తీసిన వీడియోలను కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. సంఘటన ఎలా జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే కేసును చేధిస్తామని కమిషనర్ తెలిపారు.

నందిగామలో పార్టీ కార్యాలయానికి వెళుతున్న క్రమంలో జగ్గయ్యపేట వద్ద టీడీపీ కార్యకర్తలు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. అదే సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాన్వాయ్ పై రాళ్లను విసిరారు. చంద్రబాబు భద్రతాధికారికి గాయాలయ్యాయి.
దీనిపై బాబు వైసీపీపై నిప్పులు చెరిగారు. తనది విజన్ అయితే.. జగన్ ది విధ్వంస పాలన అని, రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలనను అంతమొందించే సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం రావాలంటే తెలుగుదేశం జెండా ఎగరాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలంతా రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కలిసిరావాలని పిలుపునిచ్చారు.
-
బడి పిల్లలు శోభనం పెళ్లి కొడుకులా? ఏంటిది - గరికపాటి వ్యాఖ్యల వివాదం..!! -
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు










Click it and Unblock the Notifications