సభ్యత్వం కోల్పోతారు: తెరాసలో చేరిన ఎమ్మెల్సీలపై డిగ్గీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా, కర్నాటక రాష్ట్రాలో పార్టీ ఓటమిపై ఆంటోనీ కమిటీకి వివరించామని కాంగ్రెస్ నేత దిగ్విజయ్సింగ్ చెప్పారు. పార్టీని బలోపేతం చేసే బాధ్యత అధిష్టానం చూసుకుంటుందని చూసుకుంటుందని ఆయన బుధవారం మీడియాకు తెలిపారు.
తెలంగాణలో పార్టీలు మారిన ఎమ్మెల్సీలపై దిగ్విజయ్ స్పందించారు. కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారు తెరాసకు మద్దతు తెలిపితే పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం సభ్యత్వం కోల్పోతారని తెలిపారు. తాను ఇంచార్జీగా ఉన్న రాష్ట్రాల్లో పార్టీ ఓటమిపై తాను ఆంటోనీకి నివేదిక ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఆంటోనీతో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సమావేశమయ్యారు.

కాంగ్రెస్ వార్రూమ్లో ఆంటోని కమిటీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు బుధవారం భేటీ అయ్యారు. తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి, వీహెచ్, వంశీచంద్రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ తదితరులు భేటీకి హాజరయ్యారు.
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ నేతలు ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడిన కమిటీ సభ్యులు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలను పంచుకున్నట్లు సమాచారం.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications