'అతనూ రిషికేశ్వరితో అసభ్యంగా వ్యవహరించాడు, సిబిఐ దర్యాఫ్తు కావాలి'
గుంటూరు: తన కూతురు రిషికేశ్వరి ఆత్మహత్య ఘటన పైన సిబిఐతో దర్యాఫ్తు జరిపించాలని తండ్రి మురళీ కృష్ణ ఆదివారం డిమాండ్ చేశారు. ఆయన గుంటూరు జిల్లా కలెక్టర్ను, అర్బన్ ఎస్బీని కలిసి వినతి పత్రం అందజేశారు. అభిషేక్ అనే విద్యార్థి కూడా తన కూతురుతో అసభ్యంగా ప్రవర్తించినట్లు డైరీలో ఉందని చెప్పారు.
దీని పైన కూడా విచారణ జరిపించాలని కోరారు. లైంగిక వేధింపులు, ర్యాగింగ్ను ప్రోత్సహించిన బాబురావును అరెస్టు చేయాలని కోరారు. కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ఇవి పూర్తయ్యే వరకు పోలీసులు ఛార్జీషీటును దాఖలు చేయడాన్ని ఆపాలని కోరారు.
ర్యాగింగ్ నిరోధక చట్టంలోని అంశాలను పకడ్బంధీగా అమలు చేయాలని కోరారు. బాలసుబ్రహ్మణ్యం కమిటీ నివేదిక ఆధారంగా బాబురావును విధుల నుంచి తొలగించారని, దీనిని ప్రాతిపదికగా తీసుకొని కేసు నమోదు చేయాలని కోరారు.

రిషికేశ్వరి మృతికి పది రోజుల ముందే వేధింపులకు సంబంధించి ఫిర్యాదు చేసినా అప్పటి ప్రిన్సిపల్ బాబురావు పట్టించుకోలేదన్నారు. రిషికేశ్వరి మృతి చెందినట్లు వర్సిటీ వైద్యురాలు నిర్ధారించిన తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వకుండా జిజిహెచ్కు తరలించారన్నారు.
ప్రిన్సిపల్ మానసిక పరిస్థితి పైన గతంలో కళాశాల అధ్యాపకులు గవర్నర్కు లేఖ రాశారని మురళీ కృష్ణ కలెక్టర్, అర్బన్ ఎస్పీ దృష్టికి తీసుకు వచ్చారు. ఆయన ఆదివారం సాయంత్రం వారిని కలిశారు. అంతకుముందు ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications