సత్తెనపల్లి కుంపటి : టిడిపి..వైసిపి ల్లో భగ్గుమన్న అసంతృప్తి: రోడ్డెక్కిన నిరసనలు..!
గుంటూరు జిల్లా సత్తెనపల్లి టిక్కెట్ల కేటాయింపు టిడిపి..వైసిపి ల్లో చిచ్చు రాజేసింది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కు టిడిపి సీటు ఇవ్వటంతో అక్కడ ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. వైసిపి లో సీనియర్ నేత అంబటి రాంబాబు కు సీటు ఇవ్వటాన్ని పార్టీలోని కొందరు వ్యతిరేకిస్తూ..లోటస్ పాండ్ కు చేరుకున్నారు.

కోడెల కు వ్యతిరేకంగా రోడ్ల పైకి..
సత్తెనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోడెల శివప్రసాద్ కు టిడిపి తిరిగి సీటు కేటాయించింది. తొలి నుండి ఆయనకు నర్సరావు పేట ఎంపీగా పోటీ చేయమని టిడిపి అధినాయకత్వం కోరినా..కోడెల అంగీకరించలేదు. పట్టుబట్టి మరీ కోడెల సత్తెనపల్లి సీటు సాధించారు. అయితే, సత్తెనపల్లి సీటు కోడెలకు వద్దంటూ స్థానిక టిడిపి నేతలు ఆందోళన బాట పట్టారు. అసమ్మతి నేతలు సత్తెనపల్లిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కోడెల వద్దు..చంద్రబావద్దు, కోడెల పోవాలి అనే నినాదా లతో అసమ్మతి నేతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే, దీని పై కోడెల స్పందించారు. ఎన్నికల సమయంలో చిన్నచిన్న సమస్యలు సహజమని..తానే సత్తెనపల్లి అభ్యర్దిగా పోటీ చేస్తున్నానని కోడెల ప్రకటించారు. ఈ నెల 22న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు.
లోటస్ పాండ్ లో పంచాయితీ..
ఇదే నియోజకవర్గం నుండి వైసిపి అభ్యర్ధి అంబటి రాంబాబు దాదాపు ఖరారయ్యారు. అంబటికి సీటు ఇవ్వదంటూ పార్టీకి చెందిన బత్తుల బ్రహ్మానందరెడ్డి స్థానిక నేతలు మరి కొందరు ఆందోళన చేస్తున్నారు. వీరు అంబటికి వ్యతిరేకం గా తమ వాదనను నర్సరావుపేట పార్లమెంటరీ సమన్వయ కర్త లావు కృష్ణ దేవరాయుల వద్దకు తీసుకెళ్లారు. ఆయన ఈ పంచాయితీని కృష్ణ దేవరాయులు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచన మేరకు వెంటనే అసంతృప్తులను వెంట బెట్టుకొని లోటస్పాండ్ కు చేరుకున్నారు. వారు అక్కడ కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. అంబటి పోవాలి .. జగన్ రావాలని అంటూ అక్కడ నినాదాలు చేస్తున్నారు. వారికి జగన్ ఏ రకంగా సద్దిచెబుతారు..ఎటువంటి హామీ ఇస్తారనే దాని పై అసక్తి నెలకొంది. అయితే, వైసిపి నుండి అంబటి సత్తెనపల్లి నుండి పోటీ చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు ఈ సత్తెనపల్లి వ్యవహారం ఎటు టర్న్ తీసుకుంటుందో చూడాలి.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications