ఏపీ రాజకీయాల్లో సంచలనం.. వైసీపీ కీలక నేతతో షర్మిల సమావేశం

సాధారణంగా రాజకీయాల్లో కనిపించని ఓ అరుదైన దృశ్యం విజయవాడలో ఆవిష్కృతమైంది. ఎప్పుడూ విమర్శలు, ప్రతివిమర్శలతో కత్తులు దూసుకునే రాజకీయ నేతల మధ్య ఆప్యాయత, గౌరవం ఇంకా మిగిలి ఉన్నాయని రుజువు చేస్తూ వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఒకే వేదికపై ఎంతో హుందాగా వ్యవహరించారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశానికి హాజరైన ఈ ఇద్దరు ప్రముఖులు, రాజకీయ వైరుధ్యాలను పక్కనపెట్టి వ్యక్తిగత మర్యాదలను ప్రదర్శించారు. సమావేశానికి షర్మిల వేదికపైకి రాగానే, అప్పటికే కూర్చున్న బొత్స సత్యనారాయణ వెంటనే గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. అంతేకాకుండా, "రా అమ్మా.. ఇక్కడ కూర్చో" అంటూ ఆమెను ఆప్యాయంగా ఆహ్వానించారు.

Sharmila and Botsa s Rare Meeting Sparks Discussion on Political Decorum

బొత్స చూపిన గౌరవానికి అంతే మర్యాదగా స్పందించిన షర్మిల, ఆయన పక్కనే కూర్చుని కాసేపు ముచ్చటించారు. సమావేశం ముగిసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లే ముందు, బొత్సకు నమస్కరించి, "అన్నా వెళ్లొస్తా" అంటూ సెలవు తీసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ దృశ్యం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. బొత్స చూపిన ఆప్యాయతను, షర్మిల ప్రదర్శించిన గౌరవాన్ని చూసి పలువురు ప్రశంసించారు. ప్రజా సమస్యల విషయంలో రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, కలిసికట్టుగా వ్యవహరించాల్సిన ఆవశ్యకతను ఈ సంఘటన గుర్తు చేసింది.

అయితే, అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే షర్మిలతో బొత్స ఇలా మర్యాదగా సమావేశం కావడంపై వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+