Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాబు చెప్పకపోవచ్చు:శివప్రసాద్, సోమిరెడ్డి శాపనార్థాలు

Siva Prasad
న్యూఢిల్లీ/నెల్లూరు: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అనుమతి లేకుండానే తాము సమైక్యాంధ్ర కోసం ఆందోళన చేస్తామా? ఇరు ప్రాంతాలకు న్యాయం కోరుతున్న ఆయన చెప్పలేకపోవచ్చునని తెలుగుదేశం పార్టీ సీనియర్ పార్లమెంటు సభ్యులు శివ ప్రసాద్ శుక్రవారం అన్నారు. తాము ప్రాణాలు ఒడ్డయినా సమైక్యాంధ్రను సాధిస్తామని చెప్పారు.

సీమాంధ్ర ప్రజలు ఎవరు నిరాశకు లోను కావొద్దన్నారు. పార్లమెంటుకు ఎట్టి పరిస్థితుల్లో తాము బిల్లు రానివ్వమని చెప్పారు. సమైక్యాంధ్రను నిలుపుతామని చెప్పారు. శ్రీకృష్ణ తులాభారంలోని సంఘటనను ప్రస్తావిస్తూ.. తాము తులసిదళం వంటి పోరాటం చేస్తున్నామని, తమ పోరాటమే గెలుస్తుందన్నారు. విభజన ఉద్యమంలో సోనియా సత్యభామ లాంటివారైతే, టిడిపి తులసీదళమన్నారు.

తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లేఖ వల్లనే విభజన జరుగుతోందని నిందలేసి తప్పించుకోవద్దన్నారు. తాము లేఖను ఉపసంహరించుకుంటే విభజను ఆపేస్తామని చెబితే చంద్రబాబును ఒప్పించి తాము ఉపసంహరించుకుంటామన్నారు. తమ సవాల్‌ను స్వీకరిస్తారా అని ప్రశ్నించారు. తాము సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నామన్నారు. తమ పైన నిందలు వేయవద్దన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని తాము మొదటి నుండి చెబుతున్నామన్నారు. తెలంగాణపై తమ స్టాండ్ స్పష్టంగా ఉందని చెప్పారు. సీమాంధ్రకు న్యాయం చేయాలన్నారు.

విభజనను అడ్డుకునేందుకు జాతీయ పార్టీ నేతలను కలుస్తామన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. తాము కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టి కూలదోస్తామన్నారు. కాగా అంతకుముందు టిడిపి ఎంపీలు పార్లమెంటు ద్వారం వద్ద ధర్నా చేశారు.

సోమిరెడ్డి శాపనార్థాలు

విభజనకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, దివంగత వైయస్ కారకులని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అన్నారు. జగన్ యూపిఏకు మద్దతి ఇస్తారనే కాంగ్రెసు ఈ నిర్ణయం తీసుకుందన్నారు. తెలుగు ప్రజల పాపం ఊరికేపోదని, కాంగ్రెసు పార్టీ మట్టికొట్టుకుపోతుందని శాపనార్థాలు పెట్టారు. సుప్రీం కోర్టులో విభజనకు అడ్డుకట్ట బడుతుందనే నమ్మకముందన్నారు.

భజనకు అనుకూలంగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నా, విభజన ఏకపక్షంగా జరుగుతున్నా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయడంలేదని గాలి ముద్దుకృష్ణమ నాయుడు వేరుగా అన్నారు. అసెంబ్లీకి బిల్లు వస్తే తాము వ్యతిరేకంగా ఓటు వేస్తామన్నారు. ఎస్సెమ్మెస్‌లతో రాష్ట్రాన్ని విభజిస్తున్నారన్నారు. కాంగ్రెసును రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన తెలుగు జాతిని చీల్చాలని చూస్తోందని ధ్వజమెత్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+