వైసిపి నేత నారాయణ రెడ్డి హత్య: లోకల్ పోలీసులకు ఎస్పీ హెచ్చరిక
నారాయణ రెడ్డికి ప్రాణహానీ ఉందని పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, రక్షణ కల్పించలేకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారని నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.
కర్నూలు: నారాయణ రెడ్డికి ప్రాణహానీ ఉందని పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, రక్షణ కల్పించలేకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారని నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.
ఇటీవల కర్నూలులో వైసిపి పత్తికొండ ఇంచార్జ్ నారాయణ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఎస్పీ రవికృష్ణ మండలంలోని చెరుకులపాడు గ్రామాన్ని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా చనిపోయిన వారి కుటుంబాలని పరామర్శించారు.

స్థానిక పోలీసులపై చర్యలు
జిల్లాలో ఏప్రాంతంలోనైన ఫ్యాక్షన్ నేరాలు జరిగితే స్థానిక పోలీసు అధికారులపై చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. చెరుకులపల్లి గ్రామంలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. చెరుకులపాడు నారాయణ రెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడు హత్యల అనంతరం గ్రామంలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

సాంబశివుడు కుటుంబంతో..
సాంబశివుడు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తమ ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయానని తల్లి రాములమ్మ ఎస్పీకి తెలిపారు. ఎలాంటి ఘర్షణలకు సైతం వెళ్లేవాడు కాదని అయినా తన కుమారుడిని హత్యచేసి తమ కుటుంబ సభ్యులను దిక్కులేని వారిని చేశారన్నారు.

నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులతో..
చెరుకులపాడు నారాయణరెడ్డి ఇంటికి వెళ్లి భార్య శ్రీదేవి, సోదరుడు ప్రదీప్ కుమార్ రెడ్డి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నారాయణ రెడ్డికి ప్రాణహాని ఉందని పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశామని రక్షణ కల్పించలేకపోవడంతో ప్రాణాలు కోల్పోయారన్నారు.

ఆందోళన అవసరం లేదని భరోసా
స్థానిక ఎస్సైకి తెలిపినా పట్టించుకునేవాడుకాదని, ఆయన నిర్లక్ష్యం వల్లే ఈపరిస్థితి ఎదురయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని ఎస్పీ వారికి తెలిపారు.

నిష్పక్షపాతంగా దర్యాఫ్తు
ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై నిఘా ఉంచామని, అనుమానిత వ్యక్తులను బైండోవర్ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఫ్యాక్షనిస్టులు, వారి అనుచరుల కదలికలను పరిశీలిస్తున్నామన్నారు. చెరుకులపాడు నారాయణరెడ్డి, సాంబశివుడు హత్య కేసులో ప్రత్యేక అధికారిగా డోన్ డీఎస్పీ బాబఫకృద్దిన్ను నియమించామన్నారు. ఈ కేసు విషయంలో నిష్పక్షపాతంగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు.

అలసత్వం వహిస్తే...
స్థానిక పోలీసులు విధుల్లో అలసత్వం వహించినట్లు తెలిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. దోషులకు శిక్షపడేలా చేస్తామన్నారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications