Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుమలలో సూర్యప్రభ వాహనంపై శ్రీవారు, వెయ్యికళ్లతో ఎదురుచూపులు, గోవింద గోవింద !

తిరుమల/తిరుపతి: కలియుగదైవం ఏడుకొండస్వామి కొలువుతీరిన తిరుమలలో (Tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో (brahmotsavam) ఏడో రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు రాజసంతో నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా విచ్చేసిన భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

సూర్యప్రభ వాహనం అంటే ఆయురారోగ్య‌ప్రాప్తి: సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి (TTD) చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. సూర్యప్రభ వాహనంలో (Suryaprabha Vahanam) స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

Sri Malayappa Swamy shined brightly on Suryaprabha Vahanam on Saturday morning in Tirumala.
ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ (TTD) ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి, ఈవో శ్రీ ఏవీ ధ‌ర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, టీటీడీ (TTD) అధికారులు పాల్గొన్నారు. తిరుమలలో జరుగుతున్న నవరాత్రి బ్రహ్మత్సవాలకు హాజరు అవుతున్న శ్రీవెంకటేశ్వరస్వామి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

తిరుమలలో (Tirumala)నవరాత్రి బ్రహ్మత్సవాల్లో (brahmotsavam)భాగంగా శ్రీవారిని దర్శించుకోవడానికి వెలుతున్న భక్తుల సంఖ్య సధారణంగా ఉంది, తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. శుక్రవారం రాత్రి వరకు తిరుమలలో (Tirumala) శ్రీవారిని 69, 821 మంది దర్శించుకున్నారు, తిరుమలలోని (Tirumala) కల్యాణకట్టలో శ్రీవారికి 26, 098 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

Sri Malayappa Swamy shined brightly on Suryaprabha Vahanam on Saturday morning in Tirumala.
తిరుమలలో (Tirumala)శ్రీవారిని దర్శించుకున్న తరువాత భక్తులు శ్రీవెంకటేశ్వరస్వామికి హుండీ రూపంలో రూ 2. 27 కోట్లు సమర్పించుకుని మోక్కులు తీర్చుకున్నారు. తిరుమలలోని (Tirumala)క్యూకాంప్లెక్స్ కంపార్ట్ మెంట్లు 8 నిండిపోయాయి. సర్వదర్శనం టోకన్లు లేని భక్తులకు శ్రీవారిని దర్శించుకోవడానికి 6 గంటల సమయం పడుతోందని శనివారం టీటీడీ అధికారులు తెలిపారు. వీకెండ్ సందర్బంగా తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు (brahmotsavam) జరుగుతున్న సందర్బంగా (Tirumala) శ్రీవారి భక్తుల రద్దీ పెరుగుతోందని టీటీడీ అధికారులు అంటున్నారు.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+