తిరుమలలో సూర్యప్రభ వాహనంపై శ్రీవారు, వెయ్యికళ్లతో ఎదురుచూపులు, గోవింద గోవింద !
తిరుమల/తిరుపతి: కలియుగదైవం ఏడుకొండస్వామి కొలువుతీరిన తిరుమలలో (Tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో (brahmotsavam) ఏడో రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు రాజసంతో నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా విచ్చేసిన భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
సూర్యప్రభ వాహనం అంటే ఆయురారోగ్యప్రాప్తి: సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి (TTD) చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. సూర్యప్రభ వాహనంలో (Suryaprabha Vahanam) స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

తిరుమలలో (Tirumala)నవరాత్రి బ్రహ్మత్సవాల్లో (brahmotsavam)భాగంగా శ్రీవారిని దర్శించుకోవడానికి వెలుతున్న భక్తుల సంఖ్య సధారణంగా ఉంది, తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. శుక్రవారం రాత్రి వరకు తిరుమలలో (Tirumala) శ్రీవారిని 69, 821 మంది దర్శించుకున్నారు, తిరుమలలోని (Tirumala) కల్యాణకట్టలో శ్రీవారికి 26, 098 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు.













Click it and Unblock the Notifications