శ్రీవారిని అడ్డం పెట్టుకొని పొలిటికల్ గేమ్స్..!!
తిరుమల లడ్డు వివాదంపై రాజకీయ రగడ కొనసాగుతుంది. ప్రభుత్వం ఈ వివాదంపై సిట్ ఏర్పాటు చేసింది. అటు మాజీ సీఎం జగన్ ఈ వివాదంపై ప్రధాని మోడీకి లేఖ రాశారు.. తిరుమలలో శాంతి యాగం నిర్వహించారు. ఈ సమయంలోనే వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా తిరుమల లడ్డు వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజకీయం కోసమే చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని.. శ్రీవారిని అడ్డం పెట్టుకొని పొలిటికల్ గేమ్స్ ఆడుతున్నారని వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి సీఎం స్థాయిలో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు బాధ కలిగించాయి అన్నారు. దేవుడిని కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రజలను చంద్రబాబు ఆందోళనకు గురి చేశారని ధ్వజమెత్తారు. ప్రతి 6 నెలలకోసారి టెండర్ల ప్రక్రియ ద్వారా నెయ్యి సేకరణ జరుగుతుందని వివరించారు.

జూలైలో వచ్చిన రిపోర్టును సెప్టెంబర్లో బయటపెట్టారని.. తిరుమల పై తప్పుడు ప్రచారం మంచిది కాదని గుర్తించాలని సూచించారు. తిరుమలలో నెయ్యి ట్యాంకర్లను మూడు దశల్లో పరీక్షిస్తారని వివరించారు. పరీక్ష చేసిన తర్వాత కూడా లడ్డు తయారీకి ఎలా పంపించారని ప్రశ్నించారు. అభిషేకానికి, నైవేద్యానికి, దీపాలకు పవిత్రమైన నెయ్యిని ఉపయోగిస్తారు అన్నారు. నవనీత సేవ కోసం కొండపైనే ఆవులను పెంచి వెన్నను తయారు చేస్తున్నారని చెప్పారు. జూన్ లో వచ్చిన నెయ్యిని వెనక్కు పంపించకుండా అదే నెయ్యితో లడ్డు ఎలా తయారు చేయించారని ప్రశ్నించారు.
చంద్రబాబు తప్పు చేశారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్ని రోజులు డ్రామా చేస్తారని నిలదీశారు. సెంటిమెంట్ క్రియేట్ చేసి తిరుమలను కలుషితం చేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్, వరద నష్టం, మెడికల్ కాలేజీలు, వందరోజుల పాలన అంశాలను దృష్టి మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాజకీయాల కోసం తిరుమల పైన చేస్తున్న ప్రచారానికి ముగింపు పలకాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు.
-
ఈ నెల 30 నుంచి తిరుమలలో -
తిరుమల తరహాలో గుంటూరు, విశాఖలలో... మంత్రి గుడ్ న్యూస్! -
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications