Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేడే శ్రీశైలంలో ప్రధాన ఘట్టం- కిటకిట

నేడు.. మహా శివరాత్రి. ఈ పర్వదినం కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ కూడా ముస్తాబు అయ్యాయి. శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీకాళహస్తీశ్వరాలయం, ద్రాక్షారామం, వేములవాడ, కాళేశ్వరం.. వంటి ప్రఖ్యాత దేవాలయాలు శివరాత్రి శోభను సంతరించుకున్నాయి. వేలాదిమంది భక్తులు శివపార్వతులను దర్శించుకోనున్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టారు.

వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న ప్రసిద్ధ శ్రీశైలం భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి మహాక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. ఇక్కడ మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నేడు 'పాగాలంకరణ' ప్రధాన ఘట్టం. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు శ్రీశైలానికి వస్తారని అధికారులు అంచనా వేశారు. భక్తుల తాకిడి ఇప్పటికే ప్రారంభమైంది కూడా.

Srisailam Readies for the Largest Crowd Massive Pilgrim Turnout Expected for Maha Shivaratri around 2 lakh

శనివారం రాత్రి వేలాదిమంది శ్రీశైలానికి తరలి వెళ్తోన్నారు. మహానంది, యాగంటి, నాగేషుని కోన, పోలతాల వంటి ఇతర ప్రముఖ ఆలయాల్లోనూ భారీ రద్దీ ఉంటోంది. భక్తుల దర్శనం కోసం చేసిన ఏర్పాట్లను కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గానియా, ఎస్పీ సునీల్ షోరణ్, దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు సమీక్షించారు. పోలీసులకు దిశానిర్దేశం చేశారు. క్యూలైన్లు, ప్రధాన రహదారులపై పటిష్ఠ బందోబస్తు, పాగాలంకరణ రోజున రద్దీకి తగ్గట్టు అదనపు బలగాల మోహరింపు అవసరమని సూచించారు.

కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, భక్తులు సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ రాజకుమారి గానియా కమాండ్ కంట్రోల్ రూమ్ సీసీటీవీల ద్వారా పాతాళగంగ స్నానఘట్టం, విశ్రాంతి గృహాలు, క్యూలైన్లను పరిశీలించారు. వాటి నిర్వహణ మెరుగుపర్చాలని ఆదేశించారు. అటవీ మార్గాల గుండా కాలినడకన వచ్చే భక్తుల కోసం జిల్లా యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు 13 ప్రాంతాల్లో తాగునీరు, వైద్య శిబిరాలు, ఆహారం అందించే ఏర్పాట్లు చేశాయి.

వేలాది మంది పోలీసులు నిరంతరం విధుల్లో ఉంటారు. జిల్లాస్థాయిలో కమాండ్ కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు గగనతల నిఘా కోసం డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఉత్సవాలు సజావుగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగాలు సమన్వయం చేసుకుంటోన్నాయి. శ్రీశైలంలో ప్రత్యేక క్యూలైన్లు, పార్కింగ్, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్‌, మొబైల్ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. మంచినీరు, పారిశుధ్య సౌకర్యాలను కల్పించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+