రాజన్న రాజ్యంపై టీడీపీ విసుర్లు... రైతు దినోత్సంపై విమర్శలు..
వైఎస్ పేరు చెబితే రైతులు భయపడుతున్న సమయంలో ఆయన జయంతిని పురస్కరించుకుని రైతు దినోత్సవం జరపడంలో అర్ధం లేదని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ విమర్శించారు. వైఎస్ హయాంలో 14వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.
గుంటూరు పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆమే పలు అంశాలపై పలు అంశాలపై ప్రస్థావించారు. ఈనేపథ్యంలోనే గత కేంద్రబడ్జెట్లో రాష్ట్రానికి 5 శాతం కంటే తక్కువగా కేటాయించినా... పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటయించకపోయినా జగన్ ప్రశ్నించలేదని అన్నారు.ఇలాంటీ సమయంలో రైతు దినోత్సవాలను నిర్వహించడం రైతుల్ని మోసగించడమే అని అన్నారు.

Recommended Video

నూజివీడులో ఘనంగా వైయస్ఆర్ జయంతి వేడుకలు
మరోవైపు రాష్ట్రంలో అనధికారిక కోతలు విధిస్తున్న ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ను ఎలా అందిస్తారో అర్ధం కావడం లేదని అన్నారు. ఇక రైతు భరోసా క్రింద ప్రతి రైతుకు ఎంత ఇస్తారనే అంశంపై కూడ స్పష్టత లేదని విమర్శించారు.












Click it and Unblock the Notifications