Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బోడే ప్రసాద్ అల్టిమేటం - నేను పోటీ చేస్తున్నా..!!

టీడీపీ రెండో జాబితా తో రచ్చ మొదలైంది. పలు నియోజకవర్గాల్లో సీట్లు రాని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి మద్దతు దారులు నిరసనలకు దిగారు. 34 మందితో చంద్రబాబు రెండో జాబితా ప్రకటించారు. ఇటు జనసేనాని పవన్ తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేసారు. దీంతో..పిఠాపురంలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పెనమలూరులో బోడే ప్రసాద్ కు సీటు లేదని పార్టీ సమాచారం ఇచ్చింది. ఇప్పుడు ఈ నిర్ణయంపై కార్యకర్తలు మండిపడుతున్నారు.

టీడీపీ శ్రేణుల ఆందోళనలు
టీడీపీ రెండో జాబితా విడుదలతో పలు నియోజకవర్గాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. పవన్ కల్యాణ్ పోటీ చేసే పిఠాపురంలో టీడీపీ శ్రేణుల నిరసనలు తారా స్థాయికి చేరాయి. అక్కడ టీడీపీ ఇంఛార్జ్ వర్మ రేపు తన మద్దతు దారులతో సమావేశం కానున్నారు. స్వతంత్రంగా బరిలో నిలవాలని ఆయన మద్దతు దారులు ఒత్తడి చేస్తున్నారు.

TDP Leader Bode Prasad announces crucial decisions over party Denied ticket from Penamaluru

దీని పైన రేపు జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇటు కొవ్వూరులో మాజీ మంత్రి జవహర్ కు సీటు దక్కలేదు. తనకు సీటు ఇవ్వకపోయినా..తాను స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఇక, పెనమలూరులో పార్టీ ఇంఛార్జ్ బోడే ప్రసాద్ కు సీటు లేదని టీడీపీ నాయకత్వం సమాచారం ఇచ్చింది.

బోడే ప్రసాద్ వర్గం ఆందోళన
దీని పైన బోడే ప్రసాద్ వర్గం నిరసనలకు దిగింది. బోడేకు సీటు ఇవ్వాలని నినదించింది. దీని పైన బోడే ప్రసాద్ స్పందించారు. తాను నియోజకవర్గంలో పార్టీ కోసం చేసిన కష్టాన్ని వివరించారు. కోట్లాది రూపాయాలు ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చారు. పెనమలూరు నుంచి చంద్రబాబు కుటుంబ సభ్యులు పోటీ చేస్తే సహకరిస్తానని స్పష్టం చేసారు.

బయట వ్యక్తులు పోటీ చేస్తే తాను చంద్రబాబు ఫొటోతోనే ఎన్నికల బరిలో నిలుస్తానని ప్రకటించారు. సీటు ప్రకటించే వరకు తనకు అవకాశం దక్కుతుందనే వేచి చూస్తానని చెప్పారు. తనకు చంద్రబాబు మాటగా పార్టీ ముఖ్యులు సీటు లేని విషయం చెప్పటంతో తన గుండెలు పిండేసేలా బాధ కలిగిందని ఆవేదన వ్యక్తం చేసారు.

TDP Leader Bode Prasad announces crucial decisions over party Denied ticket from Penamaluru

పెనమలూరు దక్కేదెవరికి
తాను ఏనాడు సొంతం కోసం ఆలోచన చేయకుండా పార్టీ కోసమే పని చేసానని చెప్పుకొచ్చారు. పెనమలూరు నుంచి కొత్త అభ్యర్దిని రంగంలో దించేందుకు చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే పలువురి పేర్ల పైన సర్వే చేయించారు. అందులో బోడే ప్రసాద్ పేరు ఉంది. కానీ, తనకు ఏ కారణంతో సీటు ఇవ్వటం లేదో చెప్పాలని బోడే ప్రశ్నిస్తున్నారు.

బోడేకు సీటు లేదని తెలిసి పార్టీ కార్యకర్త పార్టీ కార్యాలయంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసాడు. టీడీపీ ఇంకా 16 నియోజకవర్గాలకు అభ్యర్దులను ప్రకటించాల్సి ఉంది. పెనమలూరుకు మూడో జాబితాలో ఖరారు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో, పెనమలూరు అభ్యర్ది ఎవరవుతారు..బోడే ప్రసాద్ నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+