కేసీఆర్పై టిడిపి ఎంపీ తీవ్ర వ్యాఖ్య, కొట్టేసిన డబ్బే.. జగన్పై దేవినేని
రాజమహేంద్రవరం: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణను ప్రత్యేక దేశంగా భావిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎంపీ రవీంద్ర బాబు శుక్రవారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పైన కేసీఆర్ ఇంకా విషం చిమ్మటం దుర్మార్గమన్నారు.
హైకోర్టు వివాదం పైన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతూ... రాష్ట్రంలో క్రాప్ హాలీడే అనేది రాజకీయ కుట్ర మాత్రమేనని ఆయన భగ్గుమన్నారు.
రైతుల్లో అలాంటి అభిప్రాయం లేదని చెప్పారు. కోనసీమకు రైల్వే కనెక్టివిటీ ప్రారంభ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు.
బాబుతో కలిసి కూర్చో: కేసీఆర్కు రాజప్ప, ఈడీ ఆటాచ్పై జగన్కు చురకకొట్టేసిన డబ్బు జఫ్తు: దేవినేని
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ప్రజల నుంచి కొట్టేసిన డబ్బును ఈడీ జఫ్తు చేసిందని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు వేరుగా అన్నారు. ఇప్పటికైనా తన పైన సీబీఐ విచారణను జగన్ ఒప్పుకోవాలన్నారు. ఈడీ ఇన్ని కోట్ల జగన్ ఆస్తులను జఫ్తు చేసిందని, ఇప్పుడు ఆయన ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.