2014 ఎన్నికల్లోపు టి, తర్వాతే విలీనంపై: తేల్చేసిన డిగ్గీ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తాము తెలంగాణ రాష్ట్ర సమితి విలీనంపై మాట్లాడుతామని చెప్పారు. తెలంగాణకు ప్రత్యేక స్టీరింగ్ కమిటీ విషయం తమ పార్టీ అధిష్టానం చూసుకుంటుందన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన శాసన సభకు ఇచ్చిన గడువును పెంచే విషయం రాష్ట్రపతి చూసుకుంటారని చెప్పారు.
సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో ముసాయిదా బిల్లుపై చర్చ సమయంలో తమ తమ ప్రాంత అభిప్రాయాలు చెప్పుకోవాలన్నారు. చర్చ ద్వారా అభిప్రాయాలు చెప్పుకునేందుకు మంచి సమయం ఉందన్నారు.
కాగా, ఈ పార్లమెంటు సమావేశాలలోనే తెలంగాణ బిల్లు వస్తుందో రాదో చెప్పలేనని దిగ్విజయ్ సింగ్ ఐదు రోజుల క్రితం అన్నారు. బిల్లు పైన అసెంబ్లీలో చర్చ జరగడం సంతోషకరమని, ఇది శుభ పరిణామమన్నారు. అభిప్రాయ సేకరణ కోసమే తాము బిల్లును అసెంబ్లీకి పంపించామన్నారు. ఈ నెల 23వ తేదీ వరకు అభిప్రాయం చెప్పేందుకు సమయమిచ్చినట్లు తెలిపారు. పార్లమెంటు సమావేశాల్లో బిల్లు వస్తుందో రాదో తెలియదన్నారు.












Click it and Unblock the Notifications