సీఎం జగన్, సీబీఐకు తెలంగాణ హైకోర్టు నోటీసులు..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్..సీబీఐకు తెలంగాణ హై కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ పైన సీబీఐ నమోదు చేసిన కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిల్ పైన ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణ జరిగింది. సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోపే సీఎం జగన్ కేసులు తేల్చేలా ఆదేశాలివ్వాలని హరిరామ జోగయ్య తన పిటీషన్ లో న్యాయస్థానాన్ని అభ్యర్దించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య పిల్ పై విచారణ జరిగింది. సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్ వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిల్గా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై విచారణ జరిగింది. పిల్లో సవరణలను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. జోగయ్య తరపు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలతో తెలంగాణ హైకోర్టు ఏకీభవించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. హరిరామజోగయ్య పిల్కు నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించింది.

సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని కోర్టుకు జోగయ్య వినతి చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోపే కేసులు తేల్చేలా ఆదేశాలివ్వాలని ఈ పిటీషన్ ద్వారా హైకోర్టును హరిరామ జోగయ్య కోరారు. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ప్రతివాదులు సీఎం జగన్, సీబీఐతో పాటుగా సీబీఐ కోర్టుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అటు టీడీపీ అధినేత చంద్రబాబు వరుస కేసుల వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నాయి. స్కిల్ స్కాంలో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన పైన వాదనలు పూర్తి కావటంతో..రేపు (గురువారం) సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఇటు హైకోర్టులోనూ చంద్రబాబు బెయిల్ పిటీషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ సమయంలో ఇటు సీఎం జగన్ పైన హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్ లో విచారణ..తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇవ్వటంతో ఆసక్తి కొనసాగుతోంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications