సింప్లిసిటీకి సిసలైన నిర్వచనం...ఈ పీపుల్స్స్టార్
హైదరాబాద్: ఈ క్రింద ఫోటోలోని వ్యక్తిని గుర్తు పట్టారా?...ఏంటి జోకా?...అతన్ని గుర్తు పట్టని వారెవరైనా ఉంటారా?...ఇక వేళ ఉంటే...వారు బహుశా తెలుగు వాళ్లయి ఉండరు అనుకుంటున్నారు కదూ!...నిజమే...మీ ఆలోచన కరెక్టే...
ఎందుకంటే...మన తెలుగువాళ్లు ప్రేమతో పీపుల్స్ స్టార్ గా పిలుచుకునే ఈ ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణ మూర్తిని గుర్తుపట్టకుండా ఎలా ఉండగలం...అయితే ఈ ఫోటోలో ఆయన ఏం చేస్తున్నారు...ఎక్కడున్నారు...అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మధ్యాహ్నం వేళ అల్పాహారంగా ఏదో తింటున్నారు. అయితే ఇదేదో సినిమా షూటింగ్ అనుకునేరు కానే కాదు...ఆయన తన ప్రయాణంలో భాగంగా అక్కడ తినేసి మరెక్కడికో వెళ్లేందుకు సన్నద్దమవుతున్నారు.

సినీ కథానాయకుడిగానే కాదు దర్శక నిర్మాతగా, సంగీత దర్శకుడుగా ఎన్నో సినిమాలు రూపొందించిన ఈ విలక్షణ నటుడు అత్యంత సాధారణమైన వ్యక్తిలా జీవిస్తాడనటానికి మనమిప్పుడు చూస్తున్న ఫోటోనే నిదర్శనం. ఈ విషయం ఆయనతో పరిచయం ఉన్న వాళ్లందరికీ తెలిసినా...ఇదిగో ఇలాంటి సందర్భాల్లో సామాన్య జనానికి కూడా తెలుస్తోంది.
మరోరకంగా చెప్పాలంటే ఆర్. నారాయణ మూర్తి స్థాయిలో ఉండి అంత సామాన్య జీవితం గడపడం సినీ నటుల్లో ఎవరికీ సాధ్యం కాదంటారు. తాను తీసిన సందేశాత్మక చిత్రాలకు అనుగుణంగానే ఆయన తన నిజ జీవితంలో ఎలాంటి ఆర్భాటాలకు, హంగులకు పోరు. చాలా సాధారణ వ్యక్తిలాగే ప్రజల్లో తిరుగుతుంటారు. అంతేకాదు ఒకే ఊర్లో వివిధ ప్రదేశాలకు వెళ్లాల్సివచ్చినప్పుడు అత్యధిక దూరం ఆయన నడిచే తిరుగుతారని చూసినవాళ్లందరూ చెప్పుకుంటారు. తప్పనిసరి అయితేనే ఆయన బస్సు, ఆటోల్లో అది కూడా మిగితా ప్రయాణికులతో కలసి సాధారణ తరగతుల్లోనే ప్రయాణిస్తారు.
దూర ప్రయాణాలైతే ఇదిగో ఇలా సామాన్య జనంలాగే ఆయన రైలు ప్రయాణాలు ఉంటాయి. ఇలా ఆర్.నారాయణ మూర్తిని చూసిన తోటి ప్రయాణికులు ఇలాంటి వాళ్లు ఇంకా ఉన్నారంటూ ఈ పీపుల్స్ స్టార్ని ఎంతగానో మెచ్చుకుంటున్నారు.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications