సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ హత్య: ముగ్గురి అరెస్టు
విశాఖపట్నం: సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ హత్యకేసును తూర్పు గోదావరి జిల్లా పోలీసులు చేధించి ముగ్గురు ముగ్గురిని శుక్రవారం అరెస్ట్ చేశారు. గత నెల 25న విశాఖ జిల్లా అడ్డరోడ్డు పి.తిమ్మాపురం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ పసలపూడి ఆంజనేయులును గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేసిన విషయం తెలిసిందే.
తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు తమ సిబ్బందితో పాటు బృందాలుగా విడిపో య రాష్ట్రంలోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. నేరస్తులు వాడిన కారు నకిలీ నెంబర్ ఆధారంగా దక్షిణ ఢిల్లీకి చెందిన సిజోచంద్రన్, మధ్యప్రదేశ్కు చెందిన సునీల్ గయేంద్రగవాడే, మహారాష్ట్ర నాగపూర్కు చెందిన బంటి అభిజిత్ గంగాధర్ మశ్రమ్లు పోలీసులకు దొరికారని శుక్రవారం ఎస్పీ రవిప్రకాష్ విలేకరులకు తెలిపారు.

గంజాయి స్వాధీనం
ఇదిలావుంటే, విశాఖపట్నం జిల్లాలోని రోలుగుంట మండలం పెదపేట దగ్గర రూ.70 లక్షల విలువ చేసే గంజాయిని నర్సీపట్నం ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడు ఒకరిని అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నారు.
విశాఖ ఏజెన్సీ నుంచి కోట్లాది రూపాయల విలువగల గంజాయి తరలిపోతుంది. ఎక్సైజ్ పోలీసులు దాడులు చేస్తున్నా గంజాయి సాగు, అక్రమ రవాణాకు తెరపడటం లేదు. గిరిజనులకు డబ్బు ప్రలోభపెట్టి గంజాయిని సాగు చేయిస్తున్నారని భావిస్తున్నారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications