శ్రీవారి లడ్డూ ప్రసాదం పై భక్తులకు TTD గుడ్ న్యూస్, ఇక నుంచి..!!
Tirumala: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్థం భక్తులు పోటెత్తుతున్నారు. విద్యాసంస్థల కు సెలవులు కావడంతో భక్తుల రాక ఒక్కసారిగా పెరిగింది. క్యూ కాంప్లెక్సులు భక్తులతో నిండి పోయాయి. శిలాతోరణం వరకు కొనసాగుతున్న భక్తుల క్యూ లైన్ ఉంది. తిరుపతి అలిపిరి దగ్గర భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలిపిరి చెక్ పాయింట్ దగ్గర పెద్ద ఎత్తున వాహనాలు బారులు తీరాయి. దీంతో, భక్తులను క్యూ లైన్లలోకి వెళ్లటం నిలిపివేసారు. రేపు (శుక్రవారం) ఉదయం నుంచి తిరిగి అనుమతించనున్నారు. ఇదే సమయం లో లడ్డూల విక్రయాన్ని పరిశీలించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు భక్తులకు కీలక హామీ ఇచ్చారు.
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వరుస సెలవులతో రద్దీ పెరిగింది. సెలవులు, వైకుంఠ ఏకాదశి, కొత్త సంవత్సరం కావటంతో జనవరి 10వ తేదీ వరకు రద్దీ కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. కాగా, సర్వదర్శన టోకెన్ల పంపిణీ కేంద్రాలైన శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులు ఉదయం నుంచే టోకెన్ల కోసం నిరీక్షించారు. కేవలం 8 వేల టోకెన్లు మాత్రమే విడుదల చేయడంతో భక్తులు నిరాశ వ్యక్తం చేశారు. 30 వేల మందికి పైగా భక్తులు సర్వదర్శనం కోసం తరలి రావడంతో టోకెన్లు పొందినవారు, లేనివారు వసతి పొందడం గగనంగా మారింది. ఇటు వైకుంఠ ఏకాదశి కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది.

ఈ సమయంలోనే తిరుమలలోని శ్రీవారి లడ్డూల విక్రయ కేంద్రంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి స్వయంగా కౌంటర్ వద్దకు వెళ్లి లడ్డూల జారీ విధానాన్ని, సిబ్బంది పనితీరు, లడ్డూ బరువును తనిఖీ చేశారు. అనంతరం లడ్డూ కౌంటర్ లోని కియోస్క్ యంత్రం వద్ద దర్శనం కాని భక్తులకు ఆధార్ నమోదు ద్వారా యూపీఐ చెల్లింపు చేసి లడ్డూలు పొందే విధానాన్ని పరిశీలించి భక్తుల నుండి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత బూందీ పోటుకు వెళ్లి బూందీ తయారీని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించడంలో భాగంగా లడ్డూ విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసినట్లు ఛైర్మన్ నాయుడు తెలిపారు.
ప్రస్తుతం టీటీడీ రోజుకు 4 లక్షల లడ్డూలు, 8 వేల కళ్యాణోత్సవ లడ్డూలను భక్తులకు విక్రయిస్తు న్నట్లు చెప్పారు. లడ్డూల నాణ్యత, రుచి, క్యూ లైన్లలో వేచి ఉండే సమయం తగ్గించడం వంటి సౌకర్యాలపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో లడ్డూల ఉత్పత్తిని పెంచి కౌంటర్ల వద్ద త్వరితగతిన భక్తులు లడ్డూలు పొందే విధంగా ఏర్పాట్లు చేస్తామని భక్తులకు హామీ ఇచ్చారు.
-
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
నేటి నుంచి ఒంటమిట్ట రాములోరి ఆలయంలో.. !! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications