పవన్తో మాట్లాడుతున్నాం, కంట్రోల్ చేసుకోవాలి: బాబు, ఎన్టీఆర్ గాలి వీచినా...
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్తో భేటీపై మాట్లాడుతున్నామని, ఇంకా తేదీ ఖరారు కావాల్సి ఉందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం చెప్పారు. ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యలపై చర్చిస్తామన్నారు.
అమరావతి: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్తో భేటీపై మాట్లాడుతున్నామని, ఇంకా తేదీ ఖరారు కావాల్సి ఉందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం చెప్పారు. ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యలపై చర్చిస్తామన్నారు.
వెంకయ్య నాయుడును ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడంపై చంద్రబాబు స్పందించారు. వెంకయ్యను ఎంపిక చేసిన విషయాన్ని బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా తనకు ఫోన్ చేసి చెప్పారన్నారు.

సంతోషమే కానీ
ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు ఆనందంగా ఉంటుందని చంద్రబాబు అన్నారు. అయితే, అంత అనుభవజ్ఞుడైన నేత, మనకు అండగా ఉండే వ్యక్తి మనకు దూరమవుతుంటే కొంత లోటుగా కూడా ఉంటుందన్నారు. అయితే, ఒక వ్యక్తికి ప్రమోషన్ వచ్చినప్పుడు, ఉన్నత పదవులు వచ్చినప్పుడు ఆహ్వానించి ముందుకు వెళ్లాలన్నారు.

సాయం చేస్తారు కానీ..
ఇన్నాళ్లూ ఎంతో అండగా ఉన్న వెంకయ్యకు తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, ఉప రాష్ట్రపతి అయిన తర్వాత కూడా ఆయన సాయం చేయడానికి పెద్ద ఆటంకం ఉంటుందని తాను అనుకోవడం లేదని చంద్రబాబు అన్నారు. అయితే, ఉప రాష్ట్రపదవిలో ఉన్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది ఉంటుందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో, తదనంతర పరిస్థితుల్లో రాష్ట్రాభివృద్ధికి ఎంతో అండగా నిలిచారని చంద్రబాబు అన్నారు.
Recommended Video


కంట్రోల్ చేసుకోవాలి
రాజకీయాల గురించి మాట్లాడే వ్యక్తి, ఉన్నపళంగా వాటిని వదులుకోవాలంటే కొంచెం ఇబ్బంది అని చంద్రబాబు అన్నారు. వెంకయ్య జీవనం మొత్తం రాజకీయాలే అన్నారు. అలాంటి వ్యక్తి ఉన్నపళంగా రాజకీయాలను కట్ చేసుకోవాలంటే చాలా సమస్యలు ఉంటాయని, చాలా కంట్రోల్ చేసుకోవాలన్నారు.

ఈ పరీక్షలో పాసవుతారు
వెంకయ్యకు ఇది ఒక పెద్ద పరీక్ష, ఈ పరీక్షలో ఆయన పాసవుతాడని చంద్రబాబు అన్నారు. దాని గురించి అనుమానం అవసరం లేదన్నారు. దక్షిణాదిన వెంకయ్య లాంటి గొప్ప వ్యక్తి మరొకరు లేరన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన పోరాడే వ్యక్తి అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం పని చేసి జాతీయస్థాయికి ఎదిగారన్నారు.

ఆయనతో ఇదీ నా అనుబంధం, ఎన్టీఆర్ గాలి వీచినప్పుడు గెలుపు
వెంకయ్యతో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 1978లో తాను, వెంకయ్య ఒకేసారి శాసనసభకు వెళ్లామనీ, అప్పుడు ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీని గజగజలాడించారని చెప్పారు. 1983లో టిడిపి గాలి వీచినప్పుడూ ఆయన గెలిచారన్నారు. ఆగస్టు సంక్షోభ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్టీఆర్కు అండగా నిలిచి పోరాడారన్నారు. వెంకయ్య ఏనాడూ అధికారం కోసం పాకులాడలేదన్నారు. విద్యార్థి నాయకుడిగా జై ఆంధ్ర ఉద్యమంలోనూ, ఎమర్జెన్సీలోనూ పోరాటాలు చేసి, జైలుకు వెళ్లారని చెప్పారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు











Click it and Unblock the Notifications