కారు బోల్తా: విజయసాయిరెడ్డికి గాయాలు, అపోలోలో చేరిక
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డికి మంగళవారం ఉదయం తృటిలో పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్ విమానాశ్రయానికి వెళుతుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు ఔటర్ రింగ్ రోడ్డుపై అదుపు తప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో విజయసాయిరెడ్డి తోపాటు పార్టీ నేతలు దుర్గా ప్రసాదరాజు, దశరత్ రెడ్డి, డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు.
ఈ నేతలంతా ప్రత్యేక హోదాపై ఏలూరు ధర్నాలో పాల్గొనేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.
vijay sai reddy ysr congress accident hyderabad విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ ప్రమాదం హైదరాబాద్
English summary
YSR Congress Party leader vijay sai reddy on Monday morning injured in an accident occurred in Hyderabad.