రెండు పాములు ఒకేసారి శివలింగాన్ని.. నాగుల చవితి నాడు అరుదైన దృశ్యం !
నాగుల చవితి పండుగను తెలుగు రాష్ట్రాల్లో భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నారు. సాధారణంగా కార్తీక మాసంలో (అక్టోబర్/నవంబర్) దీపావళి అమావాస్య తర్వాత వచ్చే శుక్లపక్షం చతుర్థి రోజున జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో శ్రావణ శుద్ధ చతుర్థి రోజు కూడా ఈ పండుగను పాటిస్తారు, కానీ కార్తీక మాసపు చవితికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలోనే నేడు నెల్లూరులోని విశ్వనాథ స్వామి ఆలయంలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది.
స్థానిక చెర్లోపల్లి రైల్వేగేట్ వద్ద ఉన్న ప్రసిద్ధ విశ్వనాథ స్వామి ఆలయంలో నాగుల చవితి నాడు భక్తులకు ఆశ్చర్యపరిచే ఘటన చోటు చేసుకుంది. రెండు నాగుపాములు శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ భక్తుల ముందు కనిపించాయి. రెండు నాగు పాములు ఒకేసారి శివలింగాన్ని చుట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొద్దిసేపటి తరువాత రెండు పాములు ఆలయం వెనుక ఉన్న పుట్టలోకి వెళ్లిపోయాయని తెలిపారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఈ అద్భుత దృశ్యం భక్తులకు ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైన అనుభూతిని కలిగించిందన్నారు.

కాగా నాగుల చవితి రోజున భక్తులు, ముఖ్యంగా మహిళలు, ఊరి పొలాల వద్ద ఉన్న పాము పుట్టల వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. నాగదేవతకు పాలు, గుడ్లు, అరటిపండ్లు, నువ్వు, వడపప్పు వంటి ప్రసాదాలను సమర్పిస్తారు. పుట్టకు నూలు చుట్టి, పసుపు, కుంకుమలతో అలంకరించి మొక్కులు చెల్లించుకుంటారు. కాగా చాలా మంది మహిళలు పిల్లల ఆరోగ్యం, శ్రేయస్సు, దీర్ఘాయుష్షు కోసం ఆ రోజున పాక్షికంగా లేదా పూర్తిగా ఉపవాసం ఉంటారు. సాయంత్రం పూజలు పూర్తయ్యాక ఉపవాసాన్ని విరమిస్తారు. ఈ రోజున భూమిని దున్నడం, చెట్లను నరకడం, కూరగాయలు కోయడం వంటివి చేయకూడదని అనాదిగా ఆచారం ఉంది.
శివ, విష్ణువుతో అనుబంధం..
నాగేంద్రుడు సర్పరాజు అయిన ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుకు పరుపుగా, వాసు పాముని రూపంలో శివుడి మెడలో అలంకారంగా ఉండి సేవలు అందించారని పురాణాలు చెబుతాయి. అందుకే ఈ రోజున నాగదేవతలను పూజిస్తే శివ, విష్ణువుల అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్మకం. అలానే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా నాగుల చవితి రోజున నాగదేవతలను పూజిస్తే రాహు, కేతు, నాగదోషం, కాలసర్పదోషం, కుజదోషం వంటి దుష్ప్రభావాలు తొలగిపోయి ఆరోగ్యం, శాంతి, కలుగుతుందని విశ్వసిస్తారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications