జూనియర్ ఎన్టీఆర్ ను ఫంక్షన్లకు అందుకే పిలవడం లేదా?
అమరావతి:నారా-నందమూరి కుటుంబాల మధ్య అంతరం పెరుగుతూనే ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన గృహప్రవేశానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. లోకేష్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో కూడ నందమూరి కుటుంబసభ్యులు హజరైనా , జూనియార్ మాత్రం గైరాజరయ్యారు.
చాలా కాలం తర్వాత నిర్వహించిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశానికి హరికృష్ణ హజరై అందర్నీ ఆశ్చర్యపరిచారు. లోకేష్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి కూడ హరికృష్ణ హజరయ్యారు. ఆయన తనయుడు కళ్యాణ రామ్ కూడ హజరయ్యారు.కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం హజరుకాలేదు.
లోకేష్ ప్రమాణస్వీకారోత్సవం ముగిసిన కొద్దిరోజులకే చంద్రబాబునాయుడు హైద్రాబాద్ లో గృహప్రవేశం చేశారు.అయితే ఈ ఫంక్షన్ కు నారా, నందమూరి కుటుంబాల నుండి అందరూ వచ్చారు. జూనియర్ మాత్రమే హజరుకాలేదు.
ఉద్దేశ్యపూర్వకంగానే జూనియర్ ను పక్కనపెడుతున్నారనే భావన ఏర్పడింది.మరో వైపు లోకేష్ మంత్రి పదవి ప్రమాణస్వీకార కార్యక్రమం సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నీ తానై చూసుకొన్నాడు. నందమూరి కుటుంబానికి ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేయడంతో అందరినీ దగ్గరుండి పలకరించారు బాలయ్య.
అక్కడే తిరుగుతూ బాలయ్య సందడి చేశారు. మరో వైపు కళ్యాణ్ రామ్ ను బాలయ్య ఆప్యాయంగా పలకరించారు.అయితే ఈ రెండు కార్యక్రమాలకు అందరూ వచ్చినా జూనియర్ ఎందుకు రాలేదనే చర్చ సాగుతోంది.
గతంలో నిర్వహించిన ఫంక్షన్ లకు జూనియర్ ను ఆహ్వానించినా రాలేదని ఈ కారణంగానే ఈ రెండు ఫంక్షన్ లకు జూనియర్ ను ఆహ్వనించలేదని సన్నిహితుల వద్ద బాబు చెప్పారని చెప్పారు.