వేధింపులు, హైదరాబాద్లో ఏలూరు మహిళా టెక్కీ ఆత్మహత్య, పోలీసుల అదుపులో భర్త
హైదరాబాద్: నగరంలో ఓ మహిళా సాఫ్టువేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె హైదరాబాదులోని ఓ సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు అత్తింటి వేధింపులే కారణమని తెలుస్తోంది. మృతురాలి పేరు రూపిణి. ఆమె ఆదివారం ఉదయం ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రపురి కాలనీలో ఈ ఘోరం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రాంతానికి చెందిన సందీప్తో రూపిణికి ఈ ఏడాది మే నెలలో పెళ్లి జరిగింది. పెళ్లయిన నాలుగు నెలలకే వరకట్న వేధింపులు మొదలయ్యాయి.

సందీప్, రూపిణిలది ప్రేమ వివాహం. ఈ ప్రేమ వివాహం ఇష్టం లేని సందీప్ తల్లిదండ్రులు వేధిస్తున్నారని తెలుస్తోంది. పెళ్లైన రెండు నెలల నుంచే వేధింపులు ఉన్నాయని రూపిణి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రూపిణి భర్త సందీప్ జిమ్ ట్రెయినర్గా ఉన్నారు.
గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వేధింపులు, ఘర్షణల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన రూపిణి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. రాయదుర్గం పోలీసులు భర్త సందీప్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications