సమ్మెకు జగన్ మద్దతు: భరోసా యాత్ర(పిక్చర్స్)
అనంతపురం: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కార్మికుల నిరసన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని జగన్మోహనరెడ్డి స్పష్టం చేశారు.
అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న జగన్మోహన్ మంగళవారం నగరంలోని ఆర్టీసీ డిపో వద్ద సమ్మె చేస్తున్న కార్మికులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె న్యాయబద్దమేనన్నారు. వారి కోర్కెలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని ఇచ్చిన హామీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అప్పుడే మర్చిపోయారా? అని ప్రశ్నించారు.
అనంతరం ఆయన తోపుదుర్తి నుంచి రైతు భరోసా యాత్ర నిర్వహించారు. ఎల్లుకట్లకు చేరుకున్న జగన్మోహన్ రెడ్డి అక్కడ హత్యకు గురైన మల్లిఖార్జున కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తర్వాత అప్పేచర్లకు చేరుకున్న జగన్.. హత్యకు గురైన సింగిల్ విండో అధ్యక్షుడు భాస్కర రెడ్డి కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడ్నుంచి గుంతకల్ నియోజకవర్గంలోని టి.కొత్తపల్లి గ్రామానికి చేరుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు ఓబుళరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు.

వైయస్ జగన్
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.

వైయస్ జగన్
కార్మికుల నిరసన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని జగన్మోహనరెడ్డి స్పష్టం చేశారు.

వైయస్ జగన్
అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న జగన్మోహన్ మంగళవారం నగరంలోని ఆర్టీసీ డిపో వద్ద సమ్మె చేస్తున్న కార్మికులను కలుసుకున్నారు.

వైయస్ జగన్
అనంతరం ఆయన తోపుదుర్తి నుంచి రైతు భరోసా యాత్ర నిర్వహించారు.

వైయస్ జగన్
ఎల్లుకట్లకు చేరుకున్న జగన్మోహన్ రెడ్డి అక్కడ హత్యకు గురైన మల్లిఖార్జున కుటుంబాన్ని పరామర్శించారు.

వైయస్ జగన్
ఆ తర్వాత అప్పేచర్లకు చేరుకున్న జగన్.. హత్యకు గురైన సింగిల్ విండో అధ్యక్షుడు భాస్కర రెడ్డి కుటుంబాన్ని ఓదార్చారు.












Click it and Unblock the Notifications