'సాక్షి అవినీతి మీడియా అని తేలింది, ఎన్నారైలను చీల్చేందుకు జగన్ కుట్ర '
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన, ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు సోమవారం నాడు తీవ్రంగా మండిపడ్డారు. సాక్షి అవినీతి మీడియా అని సీబీఐ విచారణలో తేలిందన్నారు. అందువల్లే సాక్షి ఆస్తులను అటాచ్ చేశారన్నారు.
విదేశాలలో ఉన్న తెలుగు వారిని జగన్ తన రాజకీయాల కోసం చీల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాజీనామాలతో ప్రత్యేక హోదా వస్తే క్షణంలో రాజీనామ చేస్తామని గతంలో తమ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రెఫరెండం కావాలంటే మీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని జగన్కు సవాల్ విసిరారు. ఎన్నికలకు రండి... ఎవరెన్ని సీట్లు గెలుస్తారో చూద్దామని గాలి తీవ్రంగా మండిపడ్డారు.
వెంకటగిరి ఎమ్మెల్యేపై ఆరోపణలు
రావూరు - కృష్ణపట్నం రైల్వే పనులకు రూ.5 కోట్లు ఇవ్వాలని వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ డిమాండ్ చేస్తున్నారని మంటెకార్లో కంపెనీ సెక్రటరీ ఆరోపించినట్లుగా సాక్షి మీడియాలో వార్త వచ్చింది. పనులకు ఆటంకం కలిగిస్తూ, తరుచూ ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారని పేర్కొంది. ప్రభుత్వంతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారని పేర్కొంది.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications