'సాక్షి అవినీతి మీడియా అని తేలింది, ఎన్నారైలను చీల్చేందుకు జగన్ కుట్ర '
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన, ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు సోమవారం నాడు తీవ్రంగా మండిపడ్డారు. సాక్షి అవినీతి మీడియా అని సీబీఐ విచారణలో తేలిందన్నారు. అందువల్లే సాక్షి ఆస్తులను అటాచ్ చేశారన్నారు.
విదేశాలలో ఉన్న తెలుగు వారిని జగన్ తన రాజకీయాల కోసం చీల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాజీనామాలతో ప్రత్యేక హోదా వస్తే క్షణంలో రాజీనామ చేస్తామని గతంలో తమ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రెఫరెండం కావాలంటే మీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని జగన్కు సవాల్ విసిరారు. ఎన్నికలకు రండి... ఎవరెన్ని సీట్లు గెలుస్తారో చూద్దామని గాలి తీవ్రంగా మండిపడ్డారు.
వెంకటగిరి ఎమ్మెల్యేపై ఆరోపణలు
రావూరు - కృష్ణపట్నం రైల్వే పనులకు రూ.5 కోట్లు ఇవ్వాలని వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ డిమాండ్ చేస్తున్నారని మంటెకార్లో కంపెనీ సెక్రటరీ ఆరోపించినట్లుగా సాక్షి మీడియాలో వార్త వచ్చింది. పనులకు ఆటంకం కలిగిస్తూ, తరుచూ ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారని పేర్కొంది. ప్రభుత్వంతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారని పేర్కొంది.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది












Click it and Unblock the Notifications