వైసీపీ ఐదో జాబితా విడుదలకు కసరత్తు-లిస్ట్ లో పలువురు ఎంపీ, ఎమ్మెల్యేలు ?
ఏపీలో వైసీపీ చేపడుతున్న ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా ఐదో జాబితా విడుదల చేసేందుకు కసరత్తు సాగుతోంది. ఇప్పటికే నాలుగు జాబితాల్ని విడుదల చేసిన వైసీపీ.. ఇప్పుడు ఐదో జాబితాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల్ని పిలిపించి చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా ఇవాళ మంత్రి గుడివాడ అమర్నాథ్ తో పాటు సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు సీఎం జగన్ తో భేటీ అయ్యారు.
ఇప్పటికే వైసీపీ ప్రకటించిన నాలుగు జాబితాల్లో కలిపి 10 మంది ఎంపీలు, 58 మంది ఎమ్మెల్యేల స్ధానాల్లో మార్పులు జరిగాయి. మరికొన్ని జాబితాలు త్వరలో ప్రకటిస్తామని ఇప్పటికే వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు సీఎంవో నుంచి పిలుపులు వస్తూనే ఉన్నాయి. ఈ కసరత్తు పూర్తవడానికి కనీసం రెండు రోజులు పట్టవచ్చని చెబుతున్నారు. ఇవాళ సీఎంను కలిసిన మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇప్పటికే ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో సీటు కోల్పోయారు. అలాగే కాటసాని రాంభూపాల్ రెడ్డిని కూడా తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది.

అలాగే ఎంపీల్లో నంద్యాల, గుంటూరు, నరసరావుపేటతో పాటు పలు సీట్లలో మార్పులు చేర్పులకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈసారి ప్రకటించే ఐదో జాబితాలో కనీసం నలుగురైదుగురు ఎంపీలు ఉంటారని తెలుస్తోంది. వీరి స్ధానాల్లో ఎమ్మెల్యేలను పంపడం లేదా కొత్త అభ్యర్ధులను ఎంపిక చేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే ఇప్పటికే ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో సీటు కోల్పోయిన మంత్రి గుడివాడ అమర్నాథ్ ను పెందుర్తి లేదా అనకాపల్లి ఎంపీ సీటులో పోటీ చేయించే అవకాశం ఉంది.
నంద్యాల ఎంపీ సీటులో పోచ బ్రహ్మానందరెడ్డికి బదులుగా ముస్లిం అభ్యర్ధిని ఎంచుకోనున్నారు. అయితే ఇక్కడ నటుడు అలీకి అవకాశం ఇస్తున్నా ఆయన ముందుకు రాకపోవడంతో వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ ఖాదర్ బాషాకు అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు. దీంతో పాటు మరికొన్ని సీట్లు కలిపి రేపు రాత్రికి లేదా ఎల్లుండి ఐదో జాబితా వెలువడే అవకాశముంది.
-
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications